Movie News

ఆ దర్శకుడితో మరోసారి రానా

టాలీవుడ్ టాప్ హీరో రానా గతంలో దర్శకుడు తేజతో కలిసి ఓ సినిమా చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద హిట్ అయింది. సోలో హీరోగా రానా కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అయింది. ఈ సినిమా తరువాత రానాతో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకుడు తేజ. ఆ సినిమాకి ‘రాక్షస రాజు రావణాసురుడు’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. 

మధ్యలో గోపీచంద్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు తేజ. కానీ ఆయన మారుతి ప్రాజెక్ట్ తో బిజీ అయ్యారు. ఆ తరువాత దర్శకుడు శ్రీవాస్ కి డేట్స్ ఇచ్చారు. దీంతో గోపీచంద్ తో సినిమా కుదరలేదు. దీంతో సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు తేజ. ఈ సినిమా తరువాత తేజ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. 

అభిరామ్ తో సినిమా అయిన వెంటనే రానా సినిమా ‘రాక్షస రాజు రావణాసురుడు’ సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు తేజ ఓ మీడియా పోర్టల్ తో వెల్లడించారు. రానా సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని.. దానికి సురేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.

రానాకి అనారోగ్య సమస్యలు రావడం.. ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని అన్నారు. 
ఈ ఏడాదిలోనే వీరి కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక రానా సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఆయన నటించిన ‘1945’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయన నటించిన ‘భీమ్లానాయక్’, ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

This post was last modified on February 14, 2022 5:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

24 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

1 hour ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

4 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

5 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

5 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

6 hours ago