Movie News

ఆ దర్శకుడితో మరోసారి రానా

టాలీవుడ్ టాప్ హీరో రానా గతంలో దర్శకుడు తేజతో కలిసి ఓ సినిమా చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద హిట్ అయింది. సోలో హీరోగా రానా కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అయింది. ఈ సినిమా తరువాత రానాతో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకుడు తేజ. ఆ సినిమాకి ‘రాక్షస రాజు రావణాసురుడు’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. 

మధ్యలో గోపీచంద్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు తేజ. కానీ ఆయన మారుతి ప్రాజెక్ట్ తో బిజీ అయ్యారు. ఆ తరువాత దర్శకుడు శ్రీవాస్ కి డేట్స్ ఇచ్చారు. దీంతో గోపీచంద్ తో సినిమా కుదరలేదు. దీంతో సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు తేజ. ఈ సినిమా తరువాత తేజ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. 

అభిరామ్ తో సినిమా అయిన వెంటనే రానా సినిమా ‘రాక్షస రాజు రావణాసురుడు’ సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు తేజ ఓ మీడియా పోర్టల్ తో వెల్లడించారు. రానా సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని.. దానికి సురేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.

రానాకి అనారోగ్య సమస్యలు రావడం.. ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని అన్నారు. 
ఈ ఏడాదిలోనే వీరి కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక రానా సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఆయన నటించిన ‘1945’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయన నటించిన ‘భీమ్లానాయక్’, ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

This post was last modified on February 14, 2022 5:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

39 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago