టాలీవుడ్ టాప్ హీరో రానా గతంలో దర్శకుడు తేజతో కలిసి ఓ సినిమా చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద హిట్ అయింది. సోలో హీరోగా రానా కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అయింది. ఈ సినిమా తరువాత రానాతో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకుడు తేజ. ఆ సినిమాకి ‘రాక్షస రాజు రావణాసురుడు’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
మధ్యలో గోపీచంద్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు తేజ. కానీ ఆయన మారుతి ప్రాజెక్ట్ తో బిజీ అయ్యారు. ఆ తరువాత దర్శకుడు శ్రీవాస్ కి డేట్స్ ఇచ్చారు. దీంతో గోపీచంద్ తో సినిమా కుదరలేదు. దీంతో సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు తేజ. ఈ సినిమా తరువాత తేజ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది.
అభిరామ్ తో సినిమా అయిన వెంటనే రానా సినిమా ‘రాక్షస రాజు రావణాసురుడు’ సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు తేజ ఓ మీడియా పోర్టల్ తో వెల్లడించారు. రానా సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని.. దానికి సురేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.
రానాకి అనారోగ్య సమస్యలు రావడం.. ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని అన్నారు.
ఈ ఏడాదిలోనే వీరి కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక రానా సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఆయన నటించిన ‘1945’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయన నటించిన ‘భీమ్లానాయక్’, ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
This post was last modified on February 14, 2022 5:27 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…