ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో హిందీ ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ మృణాల్ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చింది.
తన ప్రేమ, బ్రేకప్ వంటి విషయాలపై స్పందించింది. పెళ్లి, పిల్లలు అని కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో వచ్చిన అవకాశాలను వినియోగించుకొని, ఇప్పుడు నటిగా రాణిస్తున్నానని తెలిపింది. అయితే ఈ ఫీల్డ్ లో ఉండడం వలన ఏడు నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని చెప్పింది మృణాల్. ఇండస్ట్రీని కారణంగా చెప్పడంతో షాక్ అయ్యానని.. నటిని కావడం వలనే తనను వదిలేశాడని స్పష్టం చేసింది.
తను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందినవాడని.. పద్ధతులు బాగా ఫాలో అవుతాడని చెప్పింది. కొన్నాళ్లపాటు ఒకరినొకరం ప్రేమించుకున్నామని.. కానీ నటి కావడం ఆయనకు ఇష్టం లేకపోవడంతో వదిలేశాడని.. కానీ అతడిపై కోపం లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే.. ఒకవేళ అడ్జస్ట్ అయి రిలేషన్ లో ముందుకువెళ్లినా.. తరువాత మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉందని.. కాబట్టి ఇప్పుడే విడిపోవడం మంచిదని చెప్పుకొచ్చింది.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…