Movie News

బయటపడిన అతి పెద్ద మోసం

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఫ్రాడ్ బయటపడింది. గుజరాత్ లోని ఒక వ్యాపార సంస్ధ బ్యాంకులను రు. 22,842 కోట్లను చేసిన మోసంపై సీబీఐ కేసు నమోదుచేసింది,  ఇప్పటివరకు బ్యాంకులను మోసం చేసిన అతిపెద్ద ఘటనగా తాజా కేసు రికార్డు సృష్టించింది. ఇంతకీ విషయం ఏమిటంటే గుజరాత్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్ధ ఉంది. ఈ సంస్ధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని అనేక బ్యాంకుల్లో అప్పులు తీసుకుని మోసం చేసినట్లు బయటపడింది.

సంస్ధ మాజీ ఛైర్మన్, ఎండీ రిషీ కమలేష్ అగర్వాల్ తో పాటు శంతనం ముత్తుస్వామి, అశ్వనీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవేతియా తదితరులపై అవినీతి నిరోధక చట్టం కింద నేరపూరిత మోసం, కుట్ర, విశ్వాసఘాతుకం, అధికార దుర్వినియోగం లాంటి అనేక కేసులను సీబీఐ నమోదు చేసింది.  సూరత్ , బరూచ, ముంబయ్ , పూణే తదితర ప్రాంతాల్లోని సంస్ధ ఆఫీసులపై దాడులు చేసి కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జరిగిన మోసాన్ని ఎస్బీఐ 2019లోనే గుర్తించి వెంటనే ఫిర్యాదు చేసింది. 2020 మార్చిలో సీబీఐ మరిన్ని వివరాలను కోరింది. అయితే 2020 ఆగష్టులో మరోసారి బ్యాంకు రెండోసారి ఫిర్యాదు చేసింది. చివరకు ఈనెల 7వ తేదీన బ్యాంకు పై సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ సంస్థ 28 బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థల దగ్గర వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది.  ఎస్బీఐ నుండే రు. 2,468 కోట్లు అప్పు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది.

బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను నిందితులంతా భారీ ఎత్తున దారి మళ్ళించినట్లు సీబీఐ గుర్తించింది. ఏ కారణంతో అయితే అప్పులు తీసుకున్నారో దానికి భిన్నంగా నిధులను మళ్ళించినట్లు ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడింది. మరింత పెద్ద ఎత్తున జరిగిన మోసంలో నిందితులకు ఎప్పటికి శిక్షలు పడతాయో ? ఇంతకుముందే మోసాలు బయటపడి, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ వ్యవహారాలు ఎప్పటికి తేలుతాయో ఎవరికీ అర్థం కావటం లేదు. 

This post was last modified on February 13, 2022 9:08 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

2 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

3 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

3 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

5 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago