భాషతో పని లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదు. రజినీకాంత్ అంటే రజినీకాంతే. ఆయన సినిమా అంటే యావత్ దేశమంతా క్రేజే. నిజానికి ఓ మంచి హిట్టు రజినీ ఖాతాలో పడి చాలా కాలమే అయ్యింది. అయినా ఇప్పటికీ ఆయన ఓ సినిమా చేస్తున్నారంటే దానిపై భారీ అంచనాలు ఏర్పడటం ఆగడం లేదు.
రీసెంట్గా ‘పెద్దన్న’గా వచ్చిన రజినీ.. ఓపెనింగ్స్ అయితే రాబట్టారు కానీ కాన్సెప్ట్ పరంగా మెప్పించలేకపోయారు. అసలే ఆరోగ్యం బాలేకపోవడానికి తోడు మరో యావరేజ్ సినిమాని లిస్టులో వేసుకోవడంతో ఆయన ఇక సినిమాలు చేస్తారా లేక ఫుల్స్టాప్ పెట్టేస్తారా అనే డౌట్ కూడా అందరికీ వచ్చింది. ఆ అనుమానాలన్నింటికీ కొత్త అనౌన్స్మెంట్తో చెక్ పెట్టేశారు రజినీ.
రజినీ 169 సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. నయనతారతో ‘కొ కొ కోకిల’, శివకార్తికేయన్తో ‘డాక్టర్’ చిత్రాలు తీసిన నెల్సన్ దిలీప్కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ విషయాన్ని ఓ టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం విజయ్తో ‘బీస్ట్’ చిత్రాన్ని తీస్తున్నాడు నెల్సన్. అది పూర్తి కావస్తుండటంతో ఈ మూవీని సెట్స్కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ షూటింగ్ స్టార్టవబోతోంది. వచ్చే యేడు ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని కూడా ఫిక్సైనట్లు తెలుస్తోంది.
ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనరే అయినా.. ఓ స్ట్రాంగ్ స్టోరీ లైన్తో రాబోతోందట. ప్రస్తుతం రజినీకి కావాల్సింది అదే. కార్తీక్ సుబ్బరాజ్ అయినా, మురుగదాస్ అయినా, శివ అయినా.. ప్రతి ఒక్కరూ ఆయన స్టైల్పై, మేనరిజమ్స్పై కాన్సన్ట్రేట్ చేశారే తప్ప ఓ మంచి కథతో రజినీ ఇమేజ్ని మరింత పెంచే ప్రయత్నం చేయలేకపోయారు. కనీసం నెల్సన్ అయినా ఆ పని చేస్తే తలైవా అభిమానులకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు.
This post was last modified on February 10, 2022 9:27 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…