భాషతో పని లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదు. రజినీకాంత్ అంటే రజినీకాంతే. ఆయన సినిమా అంటే యావత్ దేశమంతా క్రేజే. నిజానికి ఓ మంచి హిట్టు రజినీ ఖాతాలో పడి చాలా కాలమే అయ్యింది. అయినా ఇప్పటికీ ఆయన ఓ సినిమా చేస్తున్నారంటే దానిపై భారీ అంచనాలు ఏర్పడటం ఆగడం లేదు.
రీసెంట్గా ‘పెద్దన్న’గా వచ్చిన రజినీ.. ఓపెనింగ్స్ అయితే రాబట్టారు కానీ కాన్సెప్ట్ పరంగా మెప్పించలేకపోయారు. అసలే ఆరోగ్యం బాలేకపోవడానికి తోడు మరో యావరేజ్ సినిమాని లిస్టులో వేసుకోవడంతో ఆయన ఇక సినిమాలు చేస్తారా లేక ఫుల్స్టాప్ పెట్టేస్తారా అనే డౌట్ కూడా అందరికీ వచ్చింది. ఆ అనుమానాలన్నింటికీ కొత్త అనౌన్స్మెంట్తో చెక్ పెట్టేశారు రజినీ.
రజినీ 169 సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. నయనతారతో ‘కొ కొ కోకిల’, శివకార్తికేయన్తో ‘డాక్టర్’ చిత్రాలు తీసిన నెల్సన్ దిలీప్కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ విషయాన్ని ఓ టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం విజయ్తో ‘బీస్ట్’ చిత్రాన్ని తీస్తున్నాడు నెల్సన్. అది పూర్తి కావస్తుండటంతో ఈ మూవీని సెట్స్కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ షూటింగ్ స్టార్టవబోతోంది. వచ్చే యేడు ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని కూడా ఫిక్సైనట్లు తెలుస్తోంది.
ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనరే అయినా.. ఓ స్ట్రాంగ్ స్టోరీ లైన్తో రాబోతోందట. ప్రస్తుతం రజినీకి కావాల్సింది అదే. కార్తీక్ సుబ్బరాజ్ అయినా, మురుగదాస్ అయినా, శివ అయినా.. ప్రతి ఒక్కరూ ఆయన స్టైల్పై, మేనరిజమ్స్పై కాన్సన్ట్రేట్ చేశారే తప్ప ఓ మంచి కథతో రజినీ ఇమేజ్ని మరింత పెంచే ప్రయత్నం చేయలేకపోయారు. కనీసం నెల్సన్ అయినా ఆ పని చేస్తే తలైవా అభిమానులకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు.
This post was last modified on February 10, 2022 9:27 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…