మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ఖిలాడి రిలీజ్ విషయంలో కొన్ని రోజుల ముందు వరకు చాలా సందిగ్ధత నడిచింది. దర్శక నిర్మాతలు రమేష్ వర్మ, కోనేరు సత్యనారాయణ ఫిబ్రవరి 11నే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పట్టుబడితే.. హీరో రవితేజ మాత్రం వారం తర్వాత ఖిలాడిని థియేటర్లలోకి దించితే మంచిదని అభిప్రాయపడ్డాడని.. కానీ అతడి మాటను కాదని రమేష్, సత్యనారాయణ 11నే సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించడంతో మాస్ రాజా హర్టయ్యాడని వార్తలొచ్చాయి.
ఏపీలో ఇంకా నైట్ కర్ఫ్యూ, 50 పర్సంట్ ఆక్యుపెన్సీ అమలవుతున్న నేపథ్యంలో రవితేజ వాయిదా కోరుకున్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ప్రమోషన్లలో ఎక్కడా రవితేజ కనిపించకపోవడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ఐతే అనుమానాలకు మాస్ రాజా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఖిలాడి ప్రి రిలీజ్ ఈవెంట్కు కొంచెం ఆలస్యంగా అయినా హాజరయ్యాడు.
తన ప్రసంగం సమయంలో దర్శక నిర్మాతల గురించి చాలా పాజిటివ్గానే మాట్లాడాడు రవితేజ. ఐతే ఈ సినిమాను 11న రిలీజ్ చేసే విషయంలో అనుమానాలు వ్యక్తమైనట్లుగా రవితేజ మాట్లాడ్డం గమనార్హం. 18న రిలీజ్ చేద్దామని అనుకున్న మాట వాస్తవమే అని చెప్పాడు. 11నే సినిమాను రిలీజ్ చేసే విషయంలో కొంచెం హడావుడి నెలకొందని కూడా రవితేజ వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఏదో ఒక డిస్టబెన్స్ అయితే ఉన్న మాట వాస్తవమే అని రవితేజ మాటల్ని బట్టి అర్థమైంది.
ఈ సంగతలా ఉంచితే దర్శకుడు రమేష్ వర్మను మహర్జాతకుడిగా అభివర్ణించాడు మాస్ రాజా. మామూలుగా తాను జాతకాలను, అదృష్టాన్ని అసలు నమ్మనని.. అది 2-3 శాతం మాత్రమే ఉండొచ్చని.. ఐతే రమేష్ వర్మకు మాత్రం జాతకం, అదృష్టం నిర్మాత కోనేరు సత్యనారాయణ రూపంలో బాగా కలిసొస్తున్నాయని.. ఖిలాడి లాంటి సినిమాకు అన్నీ గొప్పగా సమకూరడం, విడుదలకు ముందే కారు బహుమతిగా అందుకోవడం అంటే రమేష్ మహర్జాతకుడు కాక మరేంటి అని రవితేజ అన్నాడు.
This post was last modified on February 10, 2022 12:22 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…