Movie News

కథ కార్తీక్‌ది.. డైరెక్షన్‌ శంకర్‌‌ది

‘ఆర్‌‌ఆర్ఆర్‌‌’ సినిమా ఓ కొలిక్కి వచ్చేవరకు నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టలేదు రామ్ చరణ్. ఆ సినిమా చివరి దశకు వచ్చాక శంకర్‌‌తో సినిమాని పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఆ సిమూవీ షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడు. తన ఒరిజినల్ శైలికి భిన్నంగా కాస్త వేగంగానే ఈ ప్రాజెక్టును లాగిస్తున్నాడు శంకర్.      కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామా.

ముఖ్యమంత్రిగా గెలిచే ఐఏఎస్ ఆఫీసర్‌‌గా చరణ్ నటిస్తున్నాడు. ‘ఒకే ఒక్కడు’ సినిమాకి ఇది సీక్వెల్ అనే టాక్ ఉంది. అది నిజమో కాదో తెలీదు కానీ.. ఈ సినిమా కథ  మాత్రం శంకర్‌‌ది కాదని తేలింది. ఈ మూవీకి స్టోరీ అందించింది మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.     

లాక్‌ డౌన్‌ టైమ్‌లో శంకర్‌‌ చాలామంది దర్శకులతో మాట్లాడాడట. వారిలో కార్తీక్ కూడా ఉన్నాడు. నీ దగ్గర ఏదైనా మంచి స్టోరీ ఉంటే ఇవ్వు, దానితో సినిమా తీయడానికి నాకేం అభ్యంతరం లేదు అని కార్తీక్‌ని శంకర్‌‌ అడిగాడట. దాంతో తాను ఎప్పుడో రాసుకున్న కథను శంకర్‌‌కి ఇచ్చేశాడు కార్తీక్. ఇప్పుడు రామ్‌చరణ్‌తో శంకర్‌‌ తీస్తున్నది అదే కథ.     

ఈ విషయాలన్నీ రీసెంట్‌ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజే స్వయంగా చెప్పడంతో తెలిసింది. ఆ కథ చాలా బాగుంటుందని, దాన్ని శంకర్‌‌ తీస్తే మరింత బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇచ్చేశానని అంటున్నాడు కార్తీక్. పేట, జగమే తంత్రం లాంటి సినిమాలు తీసిన కార్తీక్ కథలు ఎలా ఉంటాయో  అందరికీ తెలుసు. అతని మాస్‌ కథకి శంకర్‌‌ క్లాస్‌ టేకింగ్‌ కలిస్తే ఎలా తయారవుతుందో చూడాలి మరి.

This post was last modified on February 9, 2022 10:23 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago