‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓ కొలిక్కి వచ్చేవరకు నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టలేదు రామ్ చరణ్. ఆ సినిమా చివరి దశకు వచ్చాక శంకర్తో సినిమాని పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఆ సిమూవీ షూటింగ్లోనే పాల్గొంటున్నాడు. తన ఒరిజినల్ శైలికి భిన్నంగా కాస్త వేగంగానే ఈ ప్రాజెక్టును లాగిస్తున్నాడు శంకర్. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామా.
ముఖ్యమంత్రిగా గెలిచే ఐఏఎస్ ఆఫీసర్గా చరణ్ నటిస్తున్నాడు. ‘ఒకే ఒక్కడు’ సినిమాకి ఇది సీక్వెల్ అనే టాక్ ఉంది. అది నిజమో కాదో తెలీదు కానీ.. ఈ సినిమా కథ మాత్రం శంకర్ది కాదని తేలింది. ఈ మూవీకి స్టోరీ అందించింది మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.
లాక్ డౌన్ టైమ్లో శంకర్ చాలామంది దర్శకులతో మాట్లాడాడట. వారిలో కార్తీక్ కూడా ఉన్నాడు. నీ దగ్గర ఏదైనా మంచి స్టోరీ ఉంటే ఇవ్వు, దానితో సినిమా తీయడానికి నాకేం అభ్యంతరం లేదు అని కార్తీక్ని శంకర్ అడిగాడట. దాంతో తాను ఎప్పుడో రాసుకున్న కథను శంకర్కి ఇచ్చేశాడు కార్తీక్. ఇప్పుడు రామ్చరణ్తో శంకర్ తీస్తున్నది అదే కథ.
ఈ విషయాలన్నీ రీసెంట్ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజే స్వయంగా చెప్పడంతో తెలిసింది. ఆ కథ చాలా బాగుంటుందని, దాన్ని శంకర్ తీస్తే మరింత బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇచ్చేశానని అంటున్నాడు కార్తీక్. పేట, జగమే తంత్రం లాంటి సినిమాలు తీసిన కార్తీక్ కథలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అతని మాస్ కథకి శంకర్ క్లాస్ టేకింగ్ కలిస్తే ఎలా తయారవుతుందో చూడాలి మరి.
This post was last modified on February 9, 2022 10:23 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…