Movie News

కథ కార్తీక్‌ది.. డైరెక్షన్‌ శంకర్‌‌ది

‘ఆర్‌‌ఆర్ఆర్‌‌’ సినిమా ఓ కొలిక్కి వచ్చేవరకు నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టలేదు రామ్ చరణ్. ఆ సినిమా చివరి దశకు వచ్చాక శంకర్‌‌తో సినిమాని పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఆ సిమూవీ షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడు. తన ఒరిజినల్ శైలికి భిన్నంగా కాస్త వేగంగానే ఈ ప్రాజెక్టును లాగిస్తున్నాడు శంకర్.      కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామా.

ముఖ్యమంత్రిగా గెలిచే ఐఏఎస్ ఆఫీసర్‌‌గా చరణ్ నటిస్తున్నాడు. ‘ఒకే ఒక్కడు’ సినిమాకి ఇది సీక్వెల్ అనే టాక్ ఉంది. అది నిజమో కాదో తెలీదు కానీ.. ఈ సినిమా కథ  మాత్రం శంకర్‌‌ది కాదని తేలింది. ఈ మూవీకి స్టోరీ అందించింది మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.     

లాక్‌ డౌన్‌ టైమ్‌లో శంకర్‌‌ చాలామంది దర్శకులతో మాట్లాడాడట. వారిలో కార్తీక్ కూడా ఉన్నాడు. నీ దగ్గర ఏదైనా మంచి స్టోరీ ఉంటే ఇవ్వు, దానితో సినిమా తీయడానికి నాకేం అభ్యంతరం లేదు అని కార్తీక్‌ని శంకర్‌‌ అడిగాడట. దాంతో తాను ఎప్పుడో రాసుకున్న కథను శంకర్‌‌కి ఇచ్చేశాడు కార్తీక్. ఇప్పుడు రామ్‌చరణ్‌తో శంకర్‌‌ తీస్తున్నది అదే కథ.     

ఈ విషయాలన్నీ రీసెంట్‌ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజే స్వయంగా చెప్పడంతో తెలిసింది. ఆ కథ చాలా బాగుంటుందని, దాన్ని శంకర్‌‌ తీస్తే మరింత బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇచ్చేశానని అంటున్నాడు కార్తీక్. పేట, జగమే తంత్రం లాంటి సినిమాలు తీసిన కార్తీక్ కథలు ఎలా ఉంటాయో  అందరికీ తెలుసు. అతని మాస్‌ కథకి శంకర్‌‌ క్లాస్‌ టేకింగ్‌ కలిస్తే ఎలా తయారవుతుందో చూడాలి మరి.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

1 hour ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

2 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago