సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందులో మహేష్ బాబు తల్లిగా ఒకప్పటి హీరోయిన్ కనిపించబోతుందని సమాచారం. త్రివిక్రమ్ తన సినిమాల ద్వారా ఒకప్పటి హీరోయిన్లకు అవకాశాలు ఇస్తుంటారు. నదియా, టబు ఇలా త్రివిక్రమ్ సినిమాలతో కొంతమంది నటీమణులకు క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరో సీనియర్ నటిని తన సినిమా కోసం సంప్రదిస్తున్నారట త్రివిక్రమ్.
ఆమె ఎవరంటే రాధా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది అగ్ర హీరోలతో ఆడిపాడింది. తరువాత కాలం అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఆమె ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు కానీ తల్లి మాదిరి షైన్ అవ్వలేకపోయారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా రాధా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో కూడా కలిసి సినిమాలు చేసిన రాధ ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరి దీనిపై త్రివిక్రమ్ అండ్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…