సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందులో మహేష్ బాబు తల్లిగా ఒకప్పటి హీరోయిన్ కనిపించబోతుందని సమాచారం. త్రివిక్రమ్ తన సినిమాల ద్వారా ఒకప్పటి హీరోయిన్లకు అవకాశాలు ఇస్తుంటారు. నదియా, టబు ఇలా త్రివిక్రమ్ సినిమాలతో కొంతమంది నటీమణులకు క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరో సీనియర్ నటిని తన సినిమా కోసం సంప్రదిస్తున్నారట త్రివిక్రమ్.
ఆమె ఎవరంటే రాధా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది అగ్ర హీరోలతో ఆడిపాడింది. తరువాత కాలం అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఆమె ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు కానీ తల్లి మాదిరి షైన్ అవ్వలేకపోయారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా రాధా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో కూడా కలిసి సినిమాలు చేసిన రాధ ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరి దీనిపై త్రివిక్రమ్ అండ్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
This post was last modified on February 9, 2022 7:46 pm
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…