సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందులో మహేష్ బాబు తల్లిగా ఒకప్పటి హీరోయిన్ కనిపించబోతుందని సమాచారం. త్రివిక్రమ్ తన సినిమాల ద్వారా ఒకప్పటి హీరోయిన్లకు అవకాశాలు ఇస్తుంటారు. నదియా, టబు ఇలా త్రివిక్రమ్ సినిమాలతో కొంతమంది నటీమణులకు క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరో సీనియర్ నటిని తన సినిమా కోసం సంప్రదిస్తున్నారట త్రివిక్రమ్.
ఆమె ఎవరంటే రాధా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది అగ్ర హీరోలతో ఆడిపాడింది. తరువాత కాలం అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఆమె ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు కానీ తల్లి మాదిరి షైన్ అవ్వలేకపోయారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా రాధా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో కూడా కలిసి సినిమాలు చేసిన రాధ ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరి దీనిపై త్రివిక్రమ్ అండ్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
This post was last modified on February 9, 2022 7:46 pm
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…