సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందులో మహేష్ బాబు తల్లిగా ఒకప్పటి హీరోయిన్ కనిపించబోతుందని సమాచారం. త్రివిక్రమ్ తన సినిమాల ద్వారా ఒకప్పటి హీరోయిన్లకు అవకాశాలు ఇస్తుంటారు. నదియా, టబు ఇలా త్రివిక్రమ్ సినిమాలతో కొంతమంది నటీమణులకు క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరో సీనియర్ నటిని తన సినిమా కోసం సంప్రదిస్తున్నారట త్రివిక్రమ్.
ఆమె ఎవరంటే రాధా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది అగ్ర హీరోలతో ఆడిపాడింది. తరువాత కాలం అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఆమె ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు కానీ తల్లి మాదిరి షైన్ అవ్వలేకపోయారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా రాధా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో కూడా కలిసి సినిమాలు చేసిన రాధ ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరి దీనిపై త్రివిక్రమ్ అండ్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
This post was last modified on February 9, 2022 7:46 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…