ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేధికగా ప్రసారమైన టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ షో ద్వారా తొలిసారి హోస్ట్గా మారి.. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మోహన్ బాబు, నాని, రవితేజ, రాజమౌళి, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, రానాతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ షోలో పాల్గొని బాలయ్యతో సందడి చేశారు.
ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్తో ‘అన్స్టాపబుల్’ సీజన్ 1 పూర్తి అయింది. తనదైన హోస్టింగ్తో మరియు రెట్టింపు ఎనర్జీతో బాలయ్య ఈ షోను సూపర్ సక్సెస్ చేసి.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు. ఇక ఇప్పుడు ఈ టాక్ షో ద్వారానే బాలయ్య మరో సెన్సేషనల్ రికార్డ్ను సెట్ చేశారు.
తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకుంది. ఫలితంగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమంగా ఆన్ స్టాపబుల్ షో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో నందమూరి అభిమానులు బాలయ్య వల్లే అన్ స్టాపబుల్ ఘన విజయం సాధించిందని తెగ మురిసిపోతున్నారు. మరోవైపు బాలయ్యతో టాక్ షో ఏంట్రా బాబూ అన్న నోర్లే.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, సీజన్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
కాగా, బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `అఖండ`తో ప్రేక్షకులను పలకరించాడీయన. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్లింది.
This post was last modified on February 9, 2022 1:08 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…