ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేధికగా ప్రసారమైన టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ షో ద్వారా తొలిసారి హోస్ట్గా మారి.. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మోహన్ బాబు, నాని, రవితేజ, రాజమౌళి, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, రానాతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ షోలో పాల్గొని బాలయ్యతో సందడి చేశారు.
ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్తో ‘అన్స్టాపబుల్’ సీజన్ 1 పూర్తి అయింది. తనదైన హోస్టింగ్తో మరియు రెట్టింపు ఎనర్జీతో బాలయ్య ఈ షోను సూపర్ సక్సెస్ చేసి.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు. ఇక ఇప్పుడు ఈ టాక్ షో ద్వారానే బాలయ్య మరో సెన్సేషనల్ రికార్డ్ను సెట్ చేశారు.
తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకుంది. ఫలితంగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమంగా ఆన్ స్టాపబుల్ షో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో నందమూరి అభిమానులు బాలయ్య వల్లే అన్ స్టాపబుల్ ఘన విజయం సాధించిందని తెగ మురిసిపోతున్నారు. మరోవైపు బాలయ్యతో టాక్ షో ఏంట్రా బాబూ అన్న నోర్లే.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, సీజన్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
కాగా, బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `అఖండ`తో ప్రేక్షకులను పలకరించాడీయన. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్లింది.
This post was last modified on February 9, 2022 1:08 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…