ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేధికగా ప్రసారమైన టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ షో ద్వారా తొలిసారి హోస్ట్గా మారి.. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మోహన్ బాబు, నాని, రవితేజ, రాజమౌళి, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, రానాతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ షోలో పాల్గొని బాలయ్యతో సందడి చేశారు.
ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్తో ‘అన్స్టాపబుల్’ సీజన్ 1 పూర్తి అయింది. తనదైన హోస్టింగ్తో మరియు రెట్టింపు ఎనర్జీతో బాలయ్య ఈ షోను సూపర్ సక్సెస్ చేసి.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు. ఇక ఇప్పుడు ఈ టాక్ షో ద్వారానే బాలయ్య మరో సెన్సేషనల్ రికార్డ్ను సెట్ చేశారు.
తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకుంది. ఫలితంగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమంగా ఆన్ స్టాపబుల్ షో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో నందమూరి అభిమానులు బాలయ్య వల్లే అన్ స్టాపబుల్ ఘన విజయం సాధించిందని తెగ మురిసిపోతున్నారు. మరోవైపు బాలయ్యతో టాక్ షో ఏంట్రా బాబూ అన్న నోర్లే.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, సీజన్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
కాగా, బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `అఖండ`తో ప్రేక్షకులను పలకరించాడీయన. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్లింది.
This post was last modified on February 9, 2022 1:08 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…