సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేయకపోతే అక్షయ్ కుమార్కి నిద్ర పట్టదు. కరోనా కారణంగా అతడు నటించిన చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోక వెయిటింగ్లో ఉన్నాయి. అయినా కూడా తన మానాన తను కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతూ.. వాటిని వెంటవెంటనే పట్టాలెక్కిస్తూ పోతున్నాడు.
అక్షయ్ కుమార్ హీరోగా నిన్న కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. ఈ మూవీకి బడేమియా చోటేమియా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్తో చాలా సంవత్సరాల క్రితం అమితాబ్, గోవిందా ఓ సినిమా చేశారు. వరుణ్ ధావన్ డైరెక్ట్ చేశాడు.
అయితే అది ఓ కామెడీ సినిమా. ఇప్పుడు అక్కీ, టైగర్ చేస్తున్నది మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్. అనౌన్స్మెంట్ టీజర్లో హీరోలిద్దరూ ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించారు. వెపన్స్తో శత్రువుల మీద విరుచుకు పడుతున్నారు. తమ సినిమా పేరుతో పాటు 2023 క్రిస్మస్కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని కూడా వీడియో ద్వారానే చెప్పారు.
ఈ జానర్ సినిమాలు తీయడంలో జాఫర్ సిద్ధహస్తుడని సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి చిత్రాలతో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సులు అదరగొట్టే అక్షయ్, టైగర్ లాంటి హీరోలతో సినిమా ప్లాన్ చేశాడంటే అది ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీప్శిఖా దేశ్ముఖ్తో కలిసి రకుల్కి కాబోయే భర్త జాకీ భగ్నానీ, అతని తండ్రి వశు భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…