సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేయకపోతే అక్షయ్ కుమార్కి నిద్ర పట్టదు. కరోనా కారణంగా అతడు నటించిన చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోక వెయిటింగ్లో ఉన్నాయి. అయినా కూడా తన మానాన తను కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతూ.. వాటిని వెంటవెంటనే పట్టాలెక్కిస్తూ పోతున్నాడు.
అక్షయ్ కుమార్ హీరోగా నిన్న కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. ఈ మూవీకి బడేమియా చోటేమియా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్తో చాలా సంవత్సరాల క్రితం అమితాబ్, గోవిందా ఓ సినిమా చేశారు. వరుణ్ ధావన్ డైరెక్ట్ చేశాడు.
అయితే అది ఓ కామెడీ సినిమా. ఇప్పుడు అక్కీ, టైగర్ చేస్తున్నది మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్. అనౌన్స్మెంట్ టీజర్లో హీరోలిద్దరూ ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించారు. వెపన్స్తో శత్రువుల మీద విరుచుకు పడుతున్నారు. తమ సినిమా పేరుతో పాటు 2023 క్రిస్మస్కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని కూడా వీడియో ద్వారానే చెప్పారు.
ఈ జానర్ సినిమాలు తీయడంలో జాఫర్ సిద్ధహస్తుడని సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి చిత్రాలతో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సులు అదరగొట్టే అక్షయ్, టైగర్ లాంటి హీరోలతో సినిమా ప్లాన్ చేశాడంటే అది ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీప్శిఖా దేశ్ముఖ్తో కలిసి రకుల్కి కాబోయే భర్త జాకీ భగ్నానీ, అతని తండ్రి వశు భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on February 9, 2022 7:12 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…