సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేయకపోతే అక్షయ్ కుమార్కి నిద్ర పట్టదు. కరోనా కారణంగా అతడు నటించిన చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోక వెయిటింగ్లో ఉన్నాయి. అయినా కూడా తన మానాన తను కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతూ.. వాటిని వెంటవెంటనే పట్టాలెక్కిస్తూ పోతున్నాడు.
అక్షయ్ కుమార్ హీరోగా నిన్న కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. ఈ మూవీకి బడేమియా చోటేమియా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్తో చాలా సంవత్సరాల క్రితం అమితాబ్, గోవిందా ఓ సినిమా చేశారు. వరుణ్ ధావన్ డైరెక్ట్ చేశాడు.
అయితే అది ఓ కామెడీ సినిమా. ఇప్పుడు అక్కీ, టైగర్ చేస్తున్నది మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్. అనౌన్స్మెంట్ టీజర్లో హీరోలిద్దరూ ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించారు. వెపన్స్తో శత్రువుల మీద విరుచుకు పడుతున్నారు. తమ సినిమా పేరుతో పాటు 2023 క్రిస్మస్కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని కూడా వీడియో ద్వారానే చెప్పారు.
ఈ జానర్ సినిమాలు తీయడంలో జాఫర్ సిద్ధహస్తుడని సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి చిత్రాలతో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సులు అదరగొట్టే అక్షయ్, టైగర్ లాంటి హీరోలతో సినిమా ప్లాన్ చేశాడంటే అది ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీప్శిఖా దేశ్ముఖ్తో కలిసి రకుల్కి కాబోయే భర్త జాకీ భగ్నానీ, అతని తండ్రి వశు భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on February 9, 2022 7:12 am
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…