బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య తాలూకు షాక్ నుంచి అతడి అభిమానులు ఒక రోజు గడిచాక కూడా తేరుకోలేకపోతున్నారు. మంచి స్థాయిలో ఉన్న నటుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. సుశాంత్ డిప్రెషన్తో కుంగిపోయేంత సమస్యలు ఏమున్నాయంటూ ఆరా తీస్తున్నారు.
ఐతే హీరోగా ఎంత మంచి స్థాయి అందుకున్నప్పటికీ.. బాలీవుడ్లో అతడి సరైన స్నేహితులు లేరని, స్టార్ కిడ్స్తో నిండిపోయిన బాలీవుడ్ అతణ్ని ఓన్ చేసుకోలేదని.. లాక్ డౌన్ వేళ అతణ్ని ఒంటరితనం వేధించిందని.. ఇప్పటికే ఉన్న మానసిక సమస్యలు ఇంకా పెద్దవై చివరికి ప్రాణాలు తీసుకునే వరకు పరిస్థితి వెళ్లిందని బాలీవుడ్ వర్గాలు అంటుున్నాయి. సుశాంత్ డిప్రెషన్తో బాధ పడుతున్న విషయం అభిమానులకు కొత్త కానీ.. బాలీవుడ్ జనాలకు తెలియంది కాదని అక్కడి మీడియా వర్గాల సమాచారం.
సుశాంత్ మానసిక సమస్యలతో బాధ పడుతున్న విషయం ఆరు నెలల కిందటే వెల్లడైందట. కానీ ఈ విషయం తెలిసి బాలీవుడ్లో ఎవ్వరూ అతడికి అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. ఈ విషయమై ఇప్పుడు సుశాంత్ అభిమానులు బాలీవుడ్ ప్రముఖుల మీద మండిపడుతున్నారు. ముఖ్యంగా అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.
సుశాంత్ ఆత్మహత్య సంగతి తెలిసి కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సుశాంత్తో టచ్లో లేకపోవడం తన తప్పే అన్నాడందులో. ఐతే ఈ పోస్ట్ మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరణ్ ఫోకస్ ఎప్పుడూ స్టార్ కిడ్స్ మీదే ఉంటుందని.. సొంతంగా ఎదిగే వాళ్లను అతను పట్టించుకోడని, పైగా చిన్న చూపు చూస్తాడని.. గతంలో తన ‘కాఫీ విత్ కరణ్’ షోకు వచ్చిన సుశాంత్ను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని.. ఇప్పుడేమో అతడితో టచ్లో లేనందుకు చింతిస్తున్నానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని.. సుశాంత్ లాంటి వాళ్లు ఆత్మన్యూనతా భావంతో ఇబ్బంది పడటానికి కరణ్ లాంటి వాళ్లే కారణం అని అతడిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on June 15, 2020 1:47 pm
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…