బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య తాలూకు షాక్ నుంచి అతడి అభిమానులు ఒక రోజు గడిచాక కూడా తేరుకోలేకపోతున్నారు. మంచి స్థాయిలో ఉన్న నటుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. సుశాంత్ డిప్రెషన్తో కుంగిపోయేంత సమస్యలు ఏమున్నాయంటూ ఆరా తీస్తున్నారు.
ఐతే హీరోగా ఎంత మంచి స్థాయి అందుకున్నప్పటికీ.. బాలీవుడ్లో అతడి సరైన స్నేహితులు లేరని, స్టార్ కిడ్స్తో నిండిపోయిన బాలీవుడ్ అతణ్ని ఓన్ చేసుకోలేదని.. లాక్ డౌన్ వేళ అతణ్ని ఒంటరితనం వేధించిందని.. ఇప్పటికే ఉన్న మానసిక సమస్యలు ఇంకా పెద్దవై చివరికి ప్రాణాలు తీసుకునే వరకు పరిస్థితి వెళ్లిందని బాలీవుడ్ వర్గాలు అంటుున్నాయి. సుశాంత్ డిప్రెషన్తో బాధ పడుతున్న విషయం అభిమానులకు కొత్త కానీ.. బాలీవుడ్ జనాలకు తెలియంది కాదని అక్కడి మీడియా వర్గాల సమాచారం.
సుశాంత్ మానసిక సమస్యలతో బాధ పడుతున్న విషయం ఆరు నెలల కిందటే వెల్లడైందట. కానీ ఈ విషయం తెలిసి బాలీవుడ్లో ఎవ్వరూ అతడికి అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. ఈ విషయమై ఇప్పుడు సుశాంత్ అభిమానులు బాలీవుడ్ ప్రముఖుల మీద మండిపడుతున్నారు. ముఖ్యంగా అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.
సుశాంత్ ఆత్మహత్య సంగతి తెలిసి కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సుశాంత్తో టచ్లో లేకపోవడం తన తప్పే అన్నాడందులో. ఐతే ఈ పోస్ట్ మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరణ్ ఫోకస్ ఎప్పుడూ స్టార్ కిడ్స్ మీదే ఉంటుందని.. సొంతంగా ఎదిగే వాళ్లను అతను పట్టించుకోడని, పైగా చిన్న చూపు చూస్తాడని.. గతంలో తన ‘కాఫీ విత్ కరణ్’ షోకు వచ్చిన సుశాంత్ను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని.. ఇప్పుడేమో అతడితో టచ్లో లేనందుకు చింతిస్తున్నానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని.. సుశాంత్ లాంటి వాళ్లు ఆత్మన్యూనతా భావంతో ఇబ్బంది పడటానికి కరణ్ లాంటి వాళ్లే కారణం అని అతడిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on June 15, 2020 1:47 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…