బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య తాలూకు షాక్ నుంచి అతడి అభిమానులు ఒక రోజు గడిచాక కూడా తేరుకోలేకపోతున్నారు. మంచి స్థాయిలో ఉన్న నటుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. సుశాంత్ డిప్రెషన్తో కుంగిపోయేంత సమస్యలు ఏమున్నాయంటూ ఆరా తీస్తున్నారు.
ఐతే హీరోగా ఎంత మంచి స్థాయి అందుకున్నప్పటికీ.. బాలీవుడ్లో అతడి సరైన స్నేహితులు లేరని, స్టార్ కిడ్స్తో నిండిపోయిన బాలీవుడ్ అతణ్ని ఓన్ చేసుకోలేదని.. లాక్ డౌన్ వేళ అతణ్ని ఒంటరితనం వేధించిందని.. ఇప్పటికే ఉన్న మానసిక సమస్యలు ఇంకా పెద్దవై చివరికి ప్రాణాలు తీసుకునే వరకు పరిస్థితి వెళ్లిందని బాలీవుడ్ వర్గాలు అంటుున్నాయి. సుశాంత్ డిప్రెషన్తో బాధ పడుతున్న విషయం అభిమానులకు కొత్త కానీ.. బాలీవుడ్ జనాలకు తెలియంది కాదని అక్కడి మీడియా వర్గాల సమాచారం.
సుశాంత్ మానసిక సమస్యలతో బాధ పడుతున్న విషయం ఆరు నెలల కిందటే వెల్లడైందట. కానీ ఈ విషయం తెలిసి బాలీవుడ్లో ఎవ్వరూ అతడికి అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. ఈ విషయమై ఇప్పుడు సుశాంత్ అభిమానులు బాలీవుడ్ ప్రముఖుల మీద మండిపడుతున్నారు. ముఖ్యంగా అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.
సుశాంత్ ఆత్మహత్య సంగతి తెలిసి కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సుశాంత్తో టచ్లో లేకపోవడం తన తప్పే అన్నాడందులో. ఐతే ఈ పోస్ట్ మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరణ్ ఫోకస్ ఎప్పుడూ స్టార్ కిడ్స్ మీదే ఉంటుందని.. సొంతంగా ఎదిగే వాళ్లను అతను పట్టించుకోడని, పైగా చిన్న చూపు చూస్తాడని.. గతంలో తన ‘కాఫీ విత్ కరణ్’ షోకు వచ్చిన సుశాంత్ను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని.. ఇప్పుడేమో అతడితో టచ్లో లేనందుకు చింతిస్తున్నానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని.. సుశాంత్ లాంటి వాళ్లు ఆత్మన్యూనతా భావంతో ఇబ్బంది పడటానికి కరణ్ లాంటి వాళ్లే కారణం అని అతడిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on June 15, 2020 1:47 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…