బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య తాలూకు షాక్ నుంచి అతడి అభిమానులు ఒక రోజు గడిచాక కూడా తేరుకోలేకపోతున్నారు. మంచి స్థాయిలో ఉన్న నటుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. సుశాంత్ డిప్రెషన్తో కుంగిపోయేంత సమస్యలు ఏమున్నాయంటూ ఆరా తీస్తున్నారు.
ఐతే హీరోగా ఎంత మంచి స్థాయి అందుకున్నప్పటికీ.. బాలీవుడ్లో అతడి సరైన స్నేహితులు లేరని, స్టార్ కిడ్స్తో నిండిపోయిన బాలీవుడ్ అతణ్ని ఓన్ చేసుకోలేదని.. లాక్ డౌన్ వేళ అతణ్ని ఒంటరితనం వేధించిందని.. ఇప్పటికే ఉన్న మానసిక సమస్యలు ఇంకా పెద్దవై చివరికి ప్రాణాలు తీసుకునే వరకు పరిస్థితి వెళ్లిందని బాలీవుడ్ వర్గాలు అంటుున్నాయి. సుశాంత్ డిప్రెషన్తో బాధ పడుతున్న విషయం అభిమానులకు కొత్త కానీ.. బాలీవుడ్ జనాలకు తెలియంది కాదని అక్కడి మీడియా వర్గాల సమాచారం.
సుశాంత్ మానసిక సమస్యలతో బాధ పడుతున్న విషయం ఆరు నెలల కిందటే వెల్లడైందట. కానీ ఈ విషయం తెలిసి బాలీవుడ్లో ఎవ్వరూ అతడికి అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. ఈ విషయమై ఇప్పుడు సుశాంత్ అభిమానులు బాలీవుడ్ ప్రముఖుల మీద మండిపడుతున్నారు. ముఖ్యంగా అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.
సుశాంత్ ఆత్మహత్య సంగతి తెలిసి కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సుశాంత్తో టచ్లో లేకపోవడం తన తప్పే అన్నాడందులో. ఐతే ఈ పోస్ట్ మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరణ్ ఫోకస్ ఎప్పుడూ స్టార్ కిడ్స్ మీదే ఉంటుందని.. సొంతంగా ఎదిగే వాళ్లను అతను పట్టించుకోడని, పైగా చిన్న చూపు చూస్తాడని.. గతంలో తన ‘కాఫీ విత్ కరణ్’ షోకు వచ్చిన సుశాంత్ను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని.. ఇప్పుడేమో అతడితో టచ్లో లేనందుకు చింతిస్తున్నానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని.. సుశాంత్ లాంటి వాళ్లు ఆత్మన్యూనతా భావంతో ఇబ్బంది పడటానికి కరణ్ లాంటి వాళ్లే కారణం అని అతడిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో ఘనంగా జరిగింది. దశాబ్దంకు పైగా ఎదురు చూసిన విజయం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మొదట 80వ…
నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్…
ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం…
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…