సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పేరుకు తమిళుడే కానీ.. భాషా భేదం లేకుండా కెరీర్ ఆరంభంలోనే అతను సూపర్ పాపులారిటీ సంపాదించాడు. కొలవరి పాటలతో అతను రేపిన సంచలనం అలాంటిలాంటిది కాదు. అప్పట్నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక పాటతో రచ్చ చేస్తూనే ఉన్నాడు. అతడి పాటల్ని తమిళులే కాక అందరూ ఎంజాయ్ చేస్తుంటారు.
గత ఏడాది మాస్టర్ సినిమా కోసం అతను కంపోజ్ చేసిన వాత్తి ింగ్ పాట ఏ స్థాయిలో సంచలనం రేపిందో తెలిసిందే. ఉత్తరాది జనాలను సైతం ఈ పాట ఊపేసింది. డ్యాన్స్, మ్యూజిక్ షోలన్నింట్లో ఈ పాట హోరెత్తిపోయింది. తమిళంలో ఇలాంటి వాటిని కుత్తు పాట అంటుంటారు. మాస్ ప్రేక్షకులు ఊగిపోయేలా చేసే పాటల్ని ఇలా అంటుంటారు. తన ప్రతి సినిమాలో ఇలాంటి కుత్తు పాట ఒకటైనా ఉండేలా చూసుకుంటాడు అనిరుధ్. ఇందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు.
ఇప్పుడతను విజయ్ కొత్త సినిమా బీస్ట్ కోసం ఒక వెరైటీ పాటనే రెడీ చేసినట్లున్నాడు. దీన్ని అరబిక్-కుత్తు సాంగ్ అని పేర్కొంటుండటం విశేషం. ఈ పాట వేలంటైన్స్ డే కానుకగా విడుదల కాబోతోంది. దీని ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో అనిరుధ్, దర్శకుడు నెల్సన్, ఈ పాట రాసిన హీరో శివ కార్తికేయన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఎప్పుడూ చేసేలా కాకుండా కొత్తగా అరబిక్ స్టయిల్లో కుత్తు సాంగ్ చేద్దామంటూ నెల్సన్, అనిరుధ్ రెడీ అవడం.. ఈ పాట రాయడానికి శివకార్తికేయన్ను పిలిపించడం.. ఒకరి మీద ఒకరు పంచులేసుకోవడం.. తర్వాత హీరో విజయ్కి ఫోన్ చేసి పాట వినిపిస్తే ఇదేం పాట అంటూ అతనూ కౌంటర్ వేయడం.. ఇలా భలే వెరైటీగా సాగింది ప్రోమో. చివర్లో ట్యూన్ కొద్దిగా వినిపించగా.. పాటలో మంచి ఊపున్నట్లు, వెరైటీగా సాగబోతున్నట్లు అర్థమైంది. చూస్తుంటే ఈ పాటతో అనిరుధ్ మరోసారి సెన్సేషణ్ క్రియేట్ చేసేలాగే ఉన్నాడు.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…