టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, బాలకృష్ణ ఇలా చాలా మంది హీరోలు బోయపాటి సినిమాల్లో నటించారు. ఇలాంటి డైరెక్టర్ కి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందట.
అదేంటంటే.. బూతులు మాట్లాడడం. ఈ విషయాన్ని సీనియర్ నటుడు జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆయన సెట్ లో తెలియకుండానే బూతులు మాట్లాడుతుంటారట. మళ్లీ నెక్స్ట్ మినిట్ కూల్ అయిపోతుంటారట. కానీ అలాంటి పెద్ద డైరెక్టర్ సెట్ లో అలా బూతులు మాట్లాడడం ఎవరికీ నచ్చేది కాదట.
జగపతి బాబు కూడా బోయపాటి అలవాటు నచ్చక.. ఎప్పటికప్పుడు బూతులు తగ్గించుకోవాలని చెప్పేవారట. ఆయనతో కలిసి వర్క్ చేసిన కొందరు సీనియర్ హీరోలు కూడా బోయపాటి అదే సూచించడంతో.. అందరి మాటలు అర్ధం చేసుకున్న బోయపాటి ఇప్పుడు సెట్స్ లో బూతులు మాట్లాడడం తగ్గించేశారని జగపతి బాబు చెప్పుకొచ్చారు.
‘అఖండ’ సినిమా షూటింగ్ సమయంలో బోయపాటి శ్రీను చాలా కూల్ గా వర్క్ చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని.. బోయపాటి అలా మారడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని జగపతి బాబు తెలిపారు.
అప్పటివరకు హీరోగా సినిమాలు చేసిన జగపతిబాబుని ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా చూపించారు బోయపాటి. ఈ సినిమా తరువాత జగపతి బాబు కెరీర్ మలుపు తిరిగింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ చాలా బిజీ అయ్యారు. ‘అఖండ’ సినిమాలో కూడా స్వామిజీ పాత్రలో కనిపించారు జగపతి.
This post was last modified on February 7, 2022 5:51 pm
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి…