ఒక గాయనికి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న దక్కిందంటే ఆమె దేశ ప్రజలకు తన పాటలతో ఎంత ఆనందాన్నిచ్చిందో.. కళకు ఆమె చేసిన సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఒక్క లతా మంగేష్కర్కు మాత్రమే దక్కిన గౌరవమిది. భాషా భేదం లేకుండా ఆమె పాటలను విని మైమరిచిపోయిన అభిమానులు కోట్లల్లోనే ఉన్నారు. ఏకంగా 35 భారతీయ భాషల్లో లత పాటలు పాడారంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఆమె పాడింది హిందీ పాటలు. వాటి గురించి అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.
వాటిలో ఏవి బాగుంటాయన్న చర్చ మొదలు పెడితే.. అది ఎంతకీ ఆగదు. తెలుగు పాడినవి చాలా తక్కువ పాటలే అయినా.. ప్రతిదీ చిర స్థాయిగా నిలిచిపోయేదే. ముఖ్యంగా ‘ఆఖరి పోరాటం’లో లత పాడిన పాటను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు.
మన గాన గంధర్వుడు ఎస్పీ బాలుతో కలిసి లత ‘ఆఖరి పోరాటం’లో తెల్లచీరకు అంటూ సాగే పాటను అద్భుతంగా ఆలపించారు. ఇళయరాజా మార్కు శ్రావ్యమైన ట్యూన్కు బాలు, లత కలిసి ప్రాణం పోశారు. లత గాత్రంలోని తియ్యదనానికి మన వాళ్లు ఫిదా అయిపోయారు. దశాబ్దాలుగా ఈ పాట తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ తరం శ్రోతలు విన్నా ఆ పాటకు ఫిదా అయిపోవాల్సిందే. తెలుగులో లతా జీ మరి కొన్ని పాటలు కూడా పాడారు.
1955లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిని ‘సంతానం’ సినిమాలో నిదురపోరా తమ్ముడా అంటూ సాగే జోల పాట కూడా ఎవర్ గ్రీనే. అలాగే ఎన్టీఆర్-జమున జంటగా నటించిన ‘దొరికితే దొంగలు’ చిత్రంలో శ్రీ వేంకటేశా.. పాటను కూడా లత తనదైన శైలిలో ఆలపించారు. తెలుగులో తక్కువ పాటలే పాడినా.. ప్రతిదాంట్లోనూ లత తన ప్రత్యేకతను చాటుకున్నారు.
This post was last modified on February 6, 2022 4:52 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…