ఒక గాయనికి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న దక్కిందంటే ఆమె దేశ ప్రజలకు తన పాటలతో ఎంత ఆనందాన్నిచ్చిందో.. కళకు ఆమె చేసిన సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఒక్క లతా మంగేష్కర్కు మాత్రమే దక్కిన గౌరవమిది. భాషా భేదం లేకుండా ఆమె పాటలను విని మైమరిచిపోయిన అభిమానులు కోట్లల్లోనే ఉన్నారు. ఏకంగా 35 భారతీయ భాషల్లో లత పాటలు పాడారంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఆమె పాడింది హిందీ పాటలు. వాటి గురించి అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.
వాటిలో ఏవి బాగుంటాయన్న చర్చ మొదలు పెడితే.. అది ఎంతకీ ఆగదు. తెలుగు పాడినవి చాలా తక్కువ పాటలే అయినా.. ప్రతిదీ చిర స్థాయిగా నిలిచిపోయేదే. ముఖ్యంగా ‘ఆఖరి పోరాటం’లో లత పాడిన పాటను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు.
మన గాన గంధర్వుడు ఎస్పీ బాలుతో కలిసి లత ‘ఆఖరి పోరాటం’లో తెల్లచీరకు అంటూ సాగే పాటను అద్భుతంగా ఆలపించారు. ఇళయరాజా మార్కు శ్రావ్యమైన ట్యూన్కు బాలు, లత కలిసి ప్రాణం పోశారు. లత గాత్రంలోని తియ్యదనానికి మన వాళ్లు ఫిదా అయిపోయారు. దశాబ్దాలుగా ఈ పాట తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ తరం శ్రోతలు విన్నా ఆ పాటకు ఫిదా అయిపోవాల్సిందే. తెలుగులో లతా జీ మరి కొన్ని పాటలు కూడా పాడారు.
1955లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిని ‘సంతానం’ సినిమాలో నిదురపోరా తమ్ముడా అంటూ సాగే జోల పాట కూడా ఎవర్ గ్రీనే. అలాగే ఎన్టీఆర్-జమున జంటగా నటించిన ‘దొరికితే దొంగలు’ చిత్రంలో శ్రీ వేంకటేశా.. పాటను కూడా లత తనదైన శైలిలో ఆలపించారు. తెలుగులో తక్కువ పాటలే పాడినా.. ప్రతిదాంట్లోనూ లత తన ప్రత్యేకతను చాటుకున్నారు.
This post was last modified on February 6, 2022 4:52 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…