టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ హిట్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్.. ఇటీవలె సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను ప్రకటించాడు. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనుందట. కానీ, త్రివిక్రమ్ మూవీలో సెకెండ్ లీడ్ రోల్ అంటేనే హీరోయిన్లు భయపడిపోతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ మూవీలో సెకెండ్ హీరోయిన్గా నటించిన వారిందరూ కెరీర్ పరంగా చాలా వెనకపడిపోయారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా మూవీలో మెయిన్ హీరోయిన్గా ఇలియానా నటించగా.. సెకెండ్ హీరోయిన్గా పార్వతీ మెల్టన్ నటించింది. కానీ, ఈ మూవీ అనంతరం పార్వతీ మెల్టన్ టాలీవుడ్లో ఎక్కువ కాలం నెలదొక్కుకోలేకపోయింది.
ఆ తర్వాత అత్తారింటికి దారేది మూవీలో ప్రణీత, సన్నాఫ్ సత్యమూర్తిలో ఆదా శర్మ, అ ఆలో అనుపమా పరమేశ్వరన్, అజ్ఞాతవాసిలో అనూ ఇమ్మాన్యూయేల్, అరవింద సమేత వీర రాఘవలో ఈశా రెబ్బా, అల వైకుంఠపురములో మూవీలో నివేతా పేతురాజ్లు సెకెండ్ హీరోయిన్గా నటించారు. అయితే వీరందరూ ప్రస్తుతం కెరీర్ పరంగా వెనకపడే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరూ ముందుకు రావడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 6, 2022 12:38 pm
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…