టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ హిట్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్.. ఇటీవలె సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను ప్రకటించాడు. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనుందట. కానీ, త్రివిక్రమ్ మూవీలో సెకెండ్ లీడ్ రోల్ అంటేనే హీరోయిన్లు భయపడిపోతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ మూవీలో సెకెండ్ హీరోయిన్గా నటించిన వారిందరూ కెరీర్ పరంగా చాలా వెనకపడిపోయారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా మూవీలో మెయిన్ హీరోయిన్గా ఇలియానా నటించగా.. సెకెండ్ హీరోయిన్గా పార్వతీ మెల్టన్ నటించింది. కానీ, ఈ మూవీ అనంతరం పార్వతీ మెల్టన్ టాలీవుడ్లో ఎక్కువ కాలం నెలదొక్కుకోలేకపోయింది.
ఆ తర్వాత అత్తారింటికి దారేది మూవీలో ప్రణీత, సన్నాఫ్ సత్యమూర్తిలో ఆదా శర్మ, అ ఆలో అనుపమా పరమేశ్వరన్, అజ్ఞాతవాసిలో అనూ ఇమ్మాన్యూయేల్, అరవింద సమేత వీర రాఘవలో ఈశా రెబ్బా, అల వైకుంఠపురములో మూవీలో నివేతా పేతురాజ్లు సెకెండ్ హీరోయిన్గా నటించారు. అయితే వీరందరూ ప్రస్తుతం కెరీర్ పరంగా వెనకపడే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరూ ముందుకు రావడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 6, 2022 12:38 pm
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…