తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై నెటిజన్లు ఒకింత సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. సాధారణంగా కేసీఆర్పై నెటిజన్లు చాలా అభిమానం చూపుతారు. ఆయనను పెద్దగా కించపరిచేలా ఎవరూ వ్యాఖ్యలుచేయరు. కానీ, తాజాగా జరిగిన పరిణామంలో మాత్రం ఒకింత సూటిగానే ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సార్.. ఇది భావ్యమేనా? మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అని కొందరు అడిగారు. మరికొందరు.. ప్రతిదాన్నీ రాజకీయంగానే చూస్తారా? అని నిలదీశారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. తాజాగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం అయిన.. రామానుజార్యుల సమతామూర్తి రూపాన్ని ప్రధాని నరేంద్ర మోడీ.. ఆవిష్కరించారు.
అయితే.. ఈ కార్యక్రమానికి అంటే.. విగ్రహ ఏర్పాటు.. సమతా మూర్తి స్థలం ఇవ్వడం.. ఇలా.. అనేక విషయాల్లో ఆది నుంచి సూచనలు, సలహాలు.. నిధులు కూడా ఏర్పాటు చేసిన.. సీఎం కేసీఆర్.. చివరి నిముషంలో గైర్హాజరయ్యారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సీఎం కేసీఆర్.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్నప్రధాని మోడీకి విమానాశ్రయంలో స్వాగతం పలకడమే కాకుండా.. హైదరాబాద్లో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉండాల్సి ఉంది. అయితే.. కేసీఆర్ హఠాత్తుగా ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన స్థానంలో ఎవరినీ పంపించలేదు.
ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లడం లేదని పేర్కొన్నాయి. నిజానికి, ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి కేసీఆర్ వెళ్లడం లేదన్న ప్రచారం శుక్రవారమే జరిగింది. ఇందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమించారంటూ నియామక పత్రం ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. నిజానికి రాష్ట్ర రాజధాని కేంద్రంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రధాని హాజరైతే గవర్నర్, ముఖ్యమంత్రి, నగర మేయర్, సీఎస్, డీజీపీ తప్పకుండా హాజరై స్వాగతించాలంటూ ప్రొటోకాల్ నిబంధన ఉంది.
అయితే, అనధికార కార్యక్రమాలకు హాజరైతే గవర్నర్, సీఎం స్వాగత కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదని, వారు తమ అభిమతం మేరకు ప్రధానిని కలవాలనుకుంటే కలవవచ్చు. ఈ నిబంధన కేసీఆర్కు కలిసి వచ్చిందని, బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విభేదాల కారణంగానే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా గైర్హాజరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
వివాదాలు.. చాలానే!
కేంద్రంలోని మోడీతో కేసీఆర్కు వివాదాలు చాలానే ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు కేసీఆర్కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. ఐఏఎస్లను బలవంతంగా బదిలీ చేయించే సవరణకు కేసీఆర్ అడ్డు చెప్పడం. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోడీపై కేసీఆర్ నిప్పులు చెరగడం తెలిసిందే. ధీనికి ముందు కూడా పలు అంశాల్లో కేసీఆర్ విభేదించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీని నేరుగా కలిసి.. స్వాగతం చెప్పే కార్యక్రమాన్ని రాజకీయంగానే ఆయన చూస్తున్నారనే వాదన పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. నెటిజన్లు దీనిని తప్పు పడుతున్నారు. ఏదేమైనా.. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వచ్చి ఉంటే బాగుండేదని.. పోనీ.. ఆయనకు అనారోగ్యంగా ఉండి ఉంటే.. తన కుమారుడినైనా పంపించి ఉంటే బాగుండేదని.. అంటున్నారు.
This post was last modified on February 6, 2022 6:54 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…