Movie News

కేసీఆర్ సార్‌.. ఇది భావ్య‌మేనా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై నెటిజ‌న్లు ఒకింత సూటిగా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. సాధార‌ణంగా కేసీఆర్‌పై నెటిజ‌న్లు చాలా అభిమానం చూపుతారు. ఆయ‌న‌ను పెద్ద‌గా కించ‌ప‌రిచేలా ఎవ‌రూ వ్యాఖ్య‌లుచేయ‌రు. కానీ, తాజాగా జ‌రిగిన ప‌రిణామంలో మాత్రం ఒకింత సూటిగానే ఆయ‌న ప్ర‌శ్నించారు. కేసీఆర్ సార్‌.. ఇది భావ్యమేనా?  మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అని కొంద‌రు అడిగారు. మ‌రికొంద‌రు.. ప్ర‌తిదాన్నీ రాజ‌కీయంగానే చూస్తారా?  అని నిలదీశారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. తాజాగా ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద విగ్ర‌హం అయిన‌.. రామానుజార్యుల స‌మ‌తామూర్తి రూపాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆవిష్క‌రించారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి అంటే.. విగ్ర‌హ ఏర్పాటు.. స‌మ‌తా మూర్తి స్థ‌లం ఇవ్వ‌డం.. ఇలా.. అనేక విష‌యాల్లో ఆది నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాలు.. నిధులు కూడా ఏర్పాటు  చేసిన‌.. సీఎం కేసీఆర్‌.. చివ‌రి నిముషంలో గైర్హాజ‌ర‌య్యారు. వాస్త‌వానికి ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం.. సీఎం కేసీఆర్‌..  వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్నప్ర‌ధాని మోడీకి విమానాశ్ర‌యంలో స్వాగతం పలకడమే కాకుండా.. హైద‌రాబాద్‌లో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉండాల్సి ఉంది. అయితే.. కేసీఆర్ హ‌ఠాత్తుగా ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. త‌న స్థానంలో ఎవ‌రినీ పంపించ‌లేదు.

 ప్రస్తుతం కేసీఆర్‌ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం లేదని పేర్కొన్నాయి.  నిజానికి, ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి కేసీఆర్‌ వెళ్లడం లేదన్న ప్రచారం శుక్రవారమే జరిగింది. ఇందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను నియమించారంటూ నియామక పత్రం ఒకటి వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. నిజానికి రాష్ట్ర రాజధాని కేంద్రంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రధాని హాజరైతే గవర్నర్‌, ముఖ్యమంత్రి, నగర మేయర్‌, సీఎస్‌, డీజీపీ తప్పకుండా హాజరై స్వాగతించాలంటూ ప్రొటోకాల్‌ నిబంధన ఉంది.

అయితే, అనధికార కార్యక్రమాలకు హాజరైతే గవర్నర్‌, సీఎం స్వాగత కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదని, వారు తమ అభిమతం మేరకు ప్రధానిని కలవాలనుకుంటే కలవవచ్చు. ఈ నిబంధన కేసీఆర్‌కు కలిసి వచ్చిందని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య విభేదాల కారణంగానే కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగా గైర్హాజరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వివాదాలు.. చాలానే!

కేంద్రంలోని మోడీతో కేసీఆర్‌కు వివాదాలు చాలానే ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం. ఐఏఎస్‌ల‌ను బ‌లవంతంగా బ‌దిలీ చేయించే స‌వ‌ర‌ణ‌కు కేసీఆర్ అడ్డు చెప్ప‌డం. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోడీపై కేసీఆర్‌ నిప్పులు చెరగ‌డం తెలిసిందే. ధీనికి ముందు కూడా ప‌లు అంశాల్లో కేసీఆర్ విభేదించారు.  ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మోడీని నేరుగా క‌లిసి.. స్వాగ‌తం చెప్పే కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయంగానే ఆయ‌న చూస్తున్నార‌నే వాద‌న పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. నెటిజ‌న్లు దీనిని త‌ప్పు ప‌డుతున్నారు. ఏదేమైనా.. ఈ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ వ‌చ్చి ఉంటే బాగుండేద‌ని.. పోనీ.. ఆయ‌న‌కు అనారోగ్యంగా ఉండి ఉంటే.. త‌న కుమారుడినైనా పంపించి ఉంటే బాగుండేద‌ని.. అంటున్నారు.

This post was last modified on February 6, 2022 6:54 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

8 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

10 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

10 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

10 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

12 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

15 hours ago