కెరీర్ ఆరంభంలో కొందరు నటుల్ని చూసి తేలిగ్గా తీసుకుంటాం. చిన్న చిన్న పాత్రల్లో వాళ్లను చూసినపుడు వాళ్ల టాలెంట్ ఏంటో జనాలకు అర్థం కాదు. కొన్ని సినిమాల వరకు వాళ్ల పేర్లు కూడా జనాలకు తెలియదు. కానీ సరైన ఛాన్స్ వచ్చి తమ టాలెంట్ చూపించే అవకాశం దక్కినపుడు ఆ నటులు విజృంభించేస్తుంటారు. తమలో నిగూఢమైన ప్రతిభనంతా బయట పెట్టేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.
ఆ తర్వాత వాళ్లు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ ఇదే కోవకు చెందుతాడు. ‘గుంటూరు టాకీస్’, ‘కల్కి’ లాంటి సినిమాల్లో చేసినపుడు సిద్ధుకు పెద్ద గుర్తింపేమీ రాలేదు. కానీ అతణ్ని లీడ్ రోల్లో పెట్టి తీసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో తన టాలెంట్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అతను రచనా సహకారం కూడా అందించాడు. యూత్కు బాగా కనెక్ట్ అయ్యే పాత్ర.. నటన.. మాటలతో సిద్ధు మెస్మరైజ్ చేసేశాడు ఆ సినిమాలో.
ఆ తర్వాత అతణ్నుంచి వచ్చిన ‘మా వింత గాథ వినుమా’ అనుకున్న స్థాయిలో లేకపోయినా.. సిద్ధు వరకు బాగానే ఎంటర్టైన్ చేశాడు.ఇప్పటిదాకా చేసినవన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు సిద్ధు నుంచి రాబోతున్న ‘డీజే టిల్లు’ మరో ఎత్తులా కనిపిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా అంతటా దాని గురించే చర్చ. హైదరాబాద్ మాస్ పోరడిగా సిద్ధు జనాలకు తెగ నచ్చేసినట్లే ఉన్నాడు. ట్రైలర్లో అతను చెప్పిన ప్రతి డైలాగ్ వైరల్ అయిపోయింది. బిల్డప్ రాజాగా తన క్యారెక్టరైజేషన్.. యూత్కు పిచ్చెక్కించేసే డైలాగ్స్ మామూలుగా పాపులర్ కాలేదు.
ఈ సినిమాకు కూడా మాటలు రాసింది సిద్ధునే. హైదరాబాద్ అర్బన్, మాస్ యూత్ పల్స్ను అతను బాగానే పట్టేసినట్లున్నాడు. చిన్న సినిమా అయినప్పటికీ ‘డీజే టిల్లు’కు బంపర్ క్రేజ్ రావడానికి సిద్ధునే కారణం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా టైటిల్ సాంగ్ సైతం సూపర్ హిట్టయింది. ఈ సినిమా రిలీజైపుడు సెన్సేషన్ క్రేయేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిద్ధు ఈ సినిమాతో ఇంకో రేంజికి వెళ్లిపోయేలా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ వీడు మామూలోడు కాదు అని సిద్ధు గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తరుణ్ భాస్కర్ లాంటి దర్శకుల చేతిలో పడితే సిద్దు ఇంకా మంచి స్థాయికి వెళ్లే ఛాన్సుందని అంటున్నారు.
This post was last modified on February 5, 2022 3:50 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…