బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ గా ఆయన షారుఖ్ ఖాన్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సోషల్ కామెడీ కాన్సెప్ట్ ను సమ్మర్ లో మొదలుపెట్టాలని చూస్తన్నారు. ఏడెనిమిది నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు రాజ్ కుమార్ హిరానీ.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నారట. రాజ్ కుమార్ హిరానీ తన సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేస్తుంటారు. ‘మున్నాభాయ్’ సినిమాలో జిమ్మీ షెర్గిల్, ‘పీకే’ సినిమాలో సంజయ్ దత్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ‘సంజు’లో విక్కీ కౌశల్ ఇలా తన ప్రతి సినిమాలో స్పెషల్ రోల్స్ ను యాడ్ చేశారు.
ఇప్పుడు షారుఖ్ సినిమాలో కూడా మరో కీలకపాత్ర ఉంటుందట. ఆ పాత్రలో విక్కీ కౌశల్ కనిపించబోతున్నట్లు సమాచారం. నిజానికి ఈ రోల్ కోసం ఒకరిద్దరిని అనుకున్నప్పటికీ రాజ్ కుమార్ హిరానీ మాత్రం విక్కీనే రంగంలోకి దించాలని చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. విక్కీతో హిరానీకి మంచి బాండింగ్ ఉంది. కాబట్టి ఆయన అడిగితే విక్కీ నో చెప్పే ఛాన్స్ లేదు.
దాదాపు షారుఖ్-విక్కీ కౌశల్ కాంబినేషన్ ఖాయమని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇందులో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం షారుఖ్ ‘పఠాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.
This post was last modified on February 4, 2022 10:05 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…