బండ్ల గణేష్ ఇప్పుడు నిర్మాతే కానీ.. ఒకప్పుడు అతనో నటుడు. మరీ పెద్ద పాత్రలేమీ చేసింది లేదు కానీ.. చిన్నవే చాలా పెద్ద సంఖ్యలో చేశాడు. అతను నటించిన సినిమాలు ట్రిపుల్ డిజిట్లోనే ఉన్నాయి. ఐతే సుదీర్ఘ కాలం నటుడిగా సినిమాలు చేసినా.. ఎప్పుడూ తాను కోరుకున్న రెస్పెక్ట్ ఇచ్చే పాత్రలు తనకు పడలేదని.. 30 ఏళ్లలో రాని రెస్పెక్ట్ ‘డేగల బాబ్జీ’ సినిమాతో తనకు వస్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు బండ్ల.
తమిళంలో గొప్ప ప్రయోగంగా పేరు తెచ్చుకుని కమర్షియల్గానూ సక్సెస్ కావడమే కాదు.. జాతీయ అవార్డు సైతం గెలుచుకున్న ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ అనే సినిమాను బండ్ల గణేష్ హీరోగా తెలుగులో ‘డేగల బాబ్జీ’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో పార్తీబన్ తనే లీడ్ రోల్ చేయడంతో పాటు దర్శకత్వం వహించాడు. దాదాపు రెండు గంటల నిడివితో ఉండే ఈ సినిమాలో ఈ ఒక్క పాత్రే ఉంటుంది.
తన మిత్రుడైన వెంకట్ చంద్ర ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ రీమేక్ హీక్కులు తీసుకున్నాక తనను కలిసి ఈ కథ చెప్పాడని.. ఎవరైనా పెద్ద హీరో ఈ సినిమా చేస్తే బాగుంటుందని తనతో అన్నానని.. కానీ ఆ పాత్ర తననే చేయమని అడగ్గానే షాకయ్యానని బండ్ల గణేష్ తెలిపాడు. పార్తీబన్ చేసిన పాత్ర.. అందులోనూ సినిమా అంతటా ఒక్కటే ఉండే పాత్రకు తనను అడగడంతో తాను చేయనంటే చేయను అనేశానని.. ఆ పాత్ర చేయడానికి తనకు చాలా భయం వేసిందని బండ్ల గణేష్ తెలిపాడు.
కానీ వెంకట్ చంద్ర పట్టు వదలకుండా తన వెంట పడి ఈ పాత్ర చేయించాడని.. చాలా భయపడుతూనే ఈ సినిమా చేసిన తాను.. చివరికి ఫస్ట్ కాపీ చూసుకుని షాకయ్యానని బండ్ల గణేష్ తెలిపాడు. కొన్ని సన్నివేశాలు చూస్తే.. ఇది చేసింది తానేనా అని ఆశ్చర్యపోయానని.. ప్రేక్షకులు సినిమా చూసినపుడు కూడా బండ్ల గణేష్లో ఇంత మంచి నటుడున్నాడా అనుకుంటారని గణేష్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on February 4, 2022 11:00 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…