సౌత్లో చార్మ్ తగ్గిపోయినా.. నార్త్లో మాత్రం నాన్స్టాప్గా దూసుకెళ్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్, అయలాన్ తప్ప ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాలీవుడ్వే. ఒకటీ రెండూ కాదు.. ఒకేసారి ఆరు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ‘అటాక్’ సినిమా ఒకటి.
జాన్ అబ్రహామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకుడు. జయంతీలాల్ గడ నిర్మిస్తున్నారు. రకుల్తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్గా చేస్తోంది. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ మూవీని ఏప్రిల్ 1న థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్టు నిన్న ప్రకటించారు. దాంతో పాటు మరో ఇంటరెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఈ మూవీ రెండు పార్ట్స్గా వస్తోంది. ఇప్పుడు చెప్పిన డేట్కి మొదటి పార్ట్ను రిలీజ్ చేసి.. నెక్స్ట్ ఇయర్ రెండో పార్ట్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో టూ పార్ట్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అయితే నిజానికి ఇది మనకి ఇప్పుడు ఎక్కువవుతోంది కానీ ఇలా ఫ్రాంచైజీలు తీయడం బాలీవుడ్లో అలవాటే. ఒక్కో సినిమానీ మూడు నాలుగు పార్టులు కూడా తీస్తుంటారు వాళ్లు. మరి అటాక్ రెండు పార్ట్స్తో ఆగుతుందో ఇంకా ముందుకు కొనసాగుతుందో చూడాలి.
This post was last modified on February 3, 2022 9:34 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…