సౌత్లో చార్మ్ తగ్గిపోయినా.. నార్త్లో మాత్రం నాన్స్టాప్గా దూసుకెళ్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్, అయలాన్ తప్ప ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాలీవుడ్వే. ఒకటీ రెండూ కాదు.. ఒకేసారి ఆరు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ‘అటాక్’ సినిమా ఒకటి.
జాన్ అబ్రహామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకుడు. జయంతీలాల్ గడ నిర్మిస్తున్నారు. రకుల్తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్గా చేస్తోంది. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ మూవీని ఏప్రిల్ 1న థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్టు నిన్న ప్రకటించారు. దాంతో పాటు మరో ఇంటరెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఈ మూవీ రెండు పార్ట్స్గా వస్తోంది. ఇప్పుడు చెప్పిన డేట్కి మొదటి పార్ట్ను రిలీజ్ చేసి.. నెక్స్ట్ ఇయర్ రెండో పార్ట్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో టూ పార్ట్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అయితే నిజానికి ఇది మనకి ఇప్పుడు ఎక్కువవుతోంది కానీ ఇలా ఫ్రాంచైజీలు తీయడం బాలీవుడ్లో అలవాటే. ఒక్కో సినిమానీ మూడు నాలుగు పార్టులు కూడా తీస్తుంటారు వాళ్లు. మరి అటాక్ రెండు పార్ట్స్తో ఆగుతుందో ఇంకా ముందుకు కొనసాగుతుందో చూడాలి.
సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు…
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…
మాములుగా మన తెలుగు తమిళ సినిమాల్లో మాఫియా అంటే ముంబైనే చూపిస్తారు. రజనీకాంత్ బాషా నుంచి పవన్ కళ్యాణ్ ఓజి…
ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…