Movie News

మెగా మూవీ సెట్‌లో నయనతార

నయనతార చేసే సినిమాల లిస్టును పరిశీలిస్తే.. ఆమె వాటిని సెలెక్ట్ చేసుకుంది అనేకంటే ఆ పాత్రలు, సినిమాలే ఆమెను ఏరి కోరి వరించాయి అనడం కరెక్టనిపిస్తుంది. కొందరు ఆమెనే దృష్టిలో పెట్టుకుని కథలు అల్లుతున్నారు. కొందరు కథ అల్లగానే ఈ పాత్ర ఆమే చేయాలి అని ఫిక్సైపోతున్నారు. గాడ్‌ఫాదర్ విషయంలో ఈ రెండోదే జరిగింది.       

మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్‌‌’ని తెలుగులో రీమేక్ చేయాలనే నిర్ణయం తీసుకోగానే మంజు వారియర్ పాత్రకి ఎవరిని తీసుకోవాలి అనే డిస్కషన్ మొదలైంది. ఎందుకంటే హీరోకి చెల్లెలే అయినా ఎంతో హుందాగా ఉండే ఆ రోల్ సినిమాకి అత్యంత కీలకం. అందుకే ఎవరైతే బాగుంటారా అని అందరూ మల్లగుల్లాలు పడ్డారు. శోభన, రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్ల నుంచి కొత్త నటీమణుల వరకు చాలామంది పేర్లు పరిశీలించారు.       

అయితే చిరంజీవి మాత్రం మొదట్నుంచీ నయనతార అయితేనే ఆ పాత్రకి బాగుంటుందని ఫీలయ్యారట. అయితే చెల్లెలి క్యారెక్టర్ కనుక నయన్ నో అంటుందేమోననే అనుమానం అందరిలోనూ ఉంది. కానీ అలా జరగలేదు. పాత్ర ప్రాధాన్యత తప్ప మరేవీ పట్టించుకోని నయన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు షూట్‌లో కూడా జాయినైంది.       

గాడ్‌ఫాదర్ సెట్‌లో జాయినవ్వడానికి రీసెంట్‌గా సిటీకి వచ్చింది నయనతార. కరోనా వల్ల ఆగిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మళ్లీ మొదలైంది. అయితే కోవిడ్ బారిన పడటంతో చిరంజీవి లేకుండానే టీమ్ అంతా వర్క్ చేస్తున్నారు. అందుకే నయన్‌ కూడా వచ్చి జాయినైంది. షూట్ కంప్లీట్ చేసుకుని హోటల్‌కి వెళ్తూ అందరి కంటా పడింది. పది రోజుల్లో తన పార్ట్ కంప్లీట్ చేసి షారుఖ్, అట్లీల సినిమా కోసం ముంబై వెళ్లనుందట నయన్. 

This post was last modified on February 3, 2022 8:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య

అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…

12 minutes ago

పాత వ్యూహమే: ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం

కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…

16 minutes ago

స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…

20 minutes ago

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

3 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీకి డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago