ఫీలిం ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్లో ఎఫైర్ల జోన్లోకి వెళ్లని వాళ్లు చాలా చాలా తక్కువ. ఐతే రిలేషన్షిప్లో ఉన్నపుడు ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. మీడియా వాళ్లు అడిగినా కొట్టి పారేస్తారు. కానీ తర్వాతేమో ఆ బంధాల తాలూకు చేదు అనుభవాల గురించి మాట్లాడుతుంటారు. ఈ జాబితాలో కంగనా రనౌత్ సహా చాలామందే ఉన్నారు. ఇప్పుడు తాప్సి పన్ను సైతం ఇదే తరహాలో మాట్లాడుతోంది.
తాను ఎవరితో డేట్ చేసింది ఏంటి అన్నది చెప్పలేదు కానీ.. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ లిస్టు పెద్దదే అని అంటోంది తాప్సి. కానీ వాళ్లలో ఒక్కరు కూడా పనికొచ్చే వారు లేరని.. అందరూ వేస్టే అని తేల్చేసింది తాప్సి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ చేసినట్లు తాప్సి వెల్లడించింది.
మరి వాళ్లలో ఎవ్వరూ మంచి వాళ్లు తగల్లేదా.. ఎవరితోనూ బంధాన్ని ముందుకు తీసుకెళ్లలేదా అని అడిగితే.. అందరూ దొంగలే అని తేల్చేసింది. తాను డేట్ చేసిన వాళ్లలో ఎవ్వరూ కూడా సక్రమంగా తమ పని తాము చేసుకుని బతికే వాళ్లు కాదని.. ఎలా మోసం చేసి, వక్ర మార్గాల్లో డబ్బులు సంపాదిద్దామా అని చూసేవాళ్లే అని.. అందుకే ఎవరితోనూ తన బంధం నిలబడలేదని తాప్సి చెప్పింది.
కెరీర్ విషయానికి వస్తే.. సౌత్ సినిమాలలో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసిన తాప్సి.. బాలీవుడ్లో అడుగు పెట్టినప్పటి నుంచి అదరగొట్టేస్తోంది. ‘బద్లా’ సహా అనేక చిత్రాల్లో తన పెర్ఫామెన్స్తో ఆకట్టుకుని మంచి విజయాలందుకుంది. కొవిడ్ నేపథ్యంలో ఈ మధ్య తాప్సి సినిమాలు వరుసగా ఓటీటీల్లో రిలీజవుతున్నాయి. గత ఏడాది నేరుగా నెట్ ఫ్లిక్స్లో రిలీజైన ‘హసీన్ దిల్రుబా’ మంచి స్పందన తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘రష్మి రాకెట్’కు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. తాజాగా ఆమె ‘లూప్ లపేటా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికీ మంచి రివ్యూలే వచ్చాయి.
This post was last modified on February 3, 2022 2:28 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…