Movie News

‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్డేట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఫైనల్ గా మే 12న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టారు. అయితే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అవుతారట. మార్చి నెలకి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నాయి.

థియేట్రికల్ రైట్స్ ను ఇప్పటికే చాలా మందికి అమ్మేశారు. తాజాగా సినిమా డిజిటల్ హక్కులను అమ్మినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని చెల్లించి ‘సర్కారు వారి పాట’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ పూర్తయి అగ్రిమెంట్ కూడా జరిగిందని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం.. ‘సర్కారు వారి పాట’ థియేటర్లో విడుదలైన 30 రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్లు ఒప్పందం చేసుకున్నారట.

అంటే మేలో సినిమా విడుదలైతే.. జూన్ నాటికి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. 
ఇప్పుడు ఏ సినిమా లైఫ్ స్పాన్ అయినా.. రెండు, మూడు వారాలే. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తో సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలైతే.. డిజిటల్ రైట్స్ కి కోట్లు పలుకుతున్నాయి. కానీ తమ అభిమాన హీరో సినిమా అతి తక్కువ సమయంలో ఓటీటీలోకి రావడం అభిమానులకు రుచించడం లేదు..

This post was last modified on February 2, 2022 5:26 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

3 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

4 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

5 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

6 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

11 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

11 hours ago