సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఫైనల్ గా మే 12న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టారు. అయితే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అవుతారట. మార్చి నెలకి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నాయి.
థియేట్రికల్ రైట్స్ ను ఇప్పటికే చాలా మందికి అమ్మేశారు. తాజాగా సినిమా డిజిటల్ హక్కులను అమ్మినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని చెల్లించి ‘సర్కారు వారి పాట’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ పూర్తయి అగ్రిమెంట్ కూడా జరిగిందని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం.. ‘సర్కారు వారి పాట’ థియేటర్లో విడుదలైన 30 రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్లు ఒప్పందం చేసుకున్నారట.
అంటే మేలో సినిమా విడుదలైతే.. జూన్ నాటికి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది.
ఇప్పుడు ఏ సినిమా లైఫ్ స్పాన్ అయినా.. రెండు, మూడు వారాలే. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తో సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలైతే.. డిజిటల్ రైట్స్ కి కోట్లు పలుకుతున్నాయి. కానీ తమ అభిమాన హీరో సినిమా అతి తక్కువ సమయంలో ఓటీటీలోకి రావడం అభిమానులకు రుచించడం లేదు..
This post was last modified on February 2, 2022 5:26 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…