Movie News

‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్డేట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఫైనల్ గా మే 12న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టారు. అయితే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అవుతారట. మార్చి నెలకి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నాయి.

థియేట్రికల్ రైట్స్ ను ఇప్పటికే చాలా మందికి అమ్మేశారు. తాజాగా సినిమా డిజిటల్ హక్కులను అమ్మినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని చెల్లించి ‘సర్కారు వారి పాట’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ పూర్తయి అగ్రిమెంట్ కూడా జరిగిందని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం.. ‘సర్కారు వారి పాట’ థియేటర్లో విడుదలైన 30 రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్లు ఒప్పందం చేసుకున్నారట.

అంటే మేలో సినిమా విడుదలైతే.. జూన్ నాటికి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. 
ఇప్పుడు ఏ సినిమా లైఫ్ స్పాన్ అయినా.. రెండు, మూడు వారాలే. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తో సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలైతే.. డిజిటల్ రైట్స్ కి కోట్లు పలుకుతున్నాయి. కానీ తమ అభిమాన హీరో సినిమా అతి తక్కువ సమయంలో ఓటీటీలోకి రావడం అభిమానులకు రుచించడం లేదు..

Satya

Recent Posts

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

36 minutes ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

4 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

4 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

7 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

7 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

7 hours ago