ఒకప్పుడు ఒక చిత్రానికి రిలీజ్ డేట్ ఇచ్చి దాన్ని మార్చాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవారు నిర్మాతలు. చెప్పిన డేట్కి సినిమాను రిలీజ్ చేయకపోతే దాన్నో అవమానంలానూ ఫీలయ్యేవాళ్లు. కానీ కరోనా మహమ్మారి వచ్చి ఈ ఆలోచనలకు చరమగీతం పాడేసింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలకే నాలుగైదుసార్లు రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చాక ఇక మిగతా సినిమాల సంగతి చెప్పేదేముంది?
ఎన్నడూ లేని విధంగా ఈ డేట్ కాకుంటే ఆ డేట్ అంటూ ఒకేసారి రెండు ఆప్షన్లు ఇచ్చే కొత్త సంస్కృతి చూస్తున్నాం ఇప్పుడు. ఒక సినిమాకు డేట్ ఇచ్చాక.. అది థియేటర్లలో దిగే వరకు గ్యారెంటీ ఉండట్లేదు. విడుదలకు రెండు మూడు రోజుల ముందు కూడా ఆలోచన మారిపోయి రిలీజ్ ఆపేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారం రావాల్సిన డీజే టిల్లు సినిమా విషయంలోనూ ఇలాగే జరిగినట్లు కనిపిస్తోంది.
ముందుగా సంక్రాంతికి ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చారు. తర్వాత ఫిబ్రవరి 4కు విడుదలను వాయిదా వేశారు. కొత్తగా ఈ డేట్ ఇచ్చి కొన్ని రోజుల ముందు వరకు ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. ఫిబ్రవరి 2న ట్రైలర్ కూడా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడేమైందో ఏమో.. ఉన్నట్లుండి విడుదల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
విడుదలకు రెండు రోజులే ఉండగా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ప్రమోషన్ల హంగామా కూడా ఏమీ లేదు. ఈ సినిమా నిర్మాణ సంస్థ హ్యాండిల్లో అప్ డేట్స్ ఆగిపోయాయి. కాస్ట్ అండ్ క్రూలో ఎవ్వరూ స్పందించడం లేదు. దీంతో ఈ వారానికి డబ్బింగ్ మూవీ సామాన్యుడునే ప్రేక్షకులకు ఏకైక ఆప్షన్ లాగా కనిపిస్తోంది. ఆ సినిమాను కొంచెం గట్టిగానే ప్రమోట్ చేసి క్రేజ్ రాబట్టాలని చూస్తున్నారు. విశాల్ సినిమాకు బోలెడన్ని థియేటర్లు కూడా దక్కేలా ఉన్నాయి.
This post was last modified on February 2, 2022 4:45 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…