టాలీవుడ్లో మరోసారి రిలీజ్ డేట్ల జాతర నడుస్తోంది. నిన్నట్నుంచి వరుసబెట్టి కొత్త సినిమాలకు డేట్లు ప్రకటిస్తున్నారు. ఇలా డేట్లు ప్రకటించడం.. తర్వాత మళ్లీ మార్చడం రెండేళ్లుగా నడుస్తున్న కథే కావడంతో జనాలు మరీ సీరియస్గా ఏమీ తీసుకోవట్లేదు. కొవిడ్ పుణ్యమా అని పరిస్థితులు అలా తయారయ్యాయి మరి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఒక సినిమాను రెండు డేట్లు ప్రకటించి ఇది కాకుంటే అది అనే కొత్త సంప్రదాయం ఇప్పుడే కనిపిస్తోంది. ఆచార్య, భీమ్లా నాయక్, గని సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు రవితేజ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ విషయంలోనే ఇలాగే చేశారు. ముందు ఈ సినిమాకు మార్చి 25న రిలీజ్ ఖాయం చేశారు.
కానీ ఇప్పుడు ఆ తేదీకి ఆర్ఆర్ఆర్ ఖరారవడంతో సమస్య వచ్చి పడింది. డేట్ మార్చుకోక తప్పలేదు. కొత్తగా ఏప్రిల్ 14కు డేట్ ఎంచుకున్నారు. అలాగని మార్చి 25 మీద ఆశలు వదులుకోలేదు. ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందేమో అన్న ఆశతో కావచ్చు. కుదిరితే మార్చి 25న లేదంటే ఏప్రిల్ 14న అంటూ ప్రకటన విడుదల చేశారు. కానీ మార్చి 25న ఆర్ఆర్ఆర్ కచ్చితంగా రిలీజవుతుందనే అంచనా వేస్తున్నారు. ఆ చిత్ర బృందం కూడా ఆ విషయంలో చాలా పట్టుదలగా ఉంది.
కాబట్టి రామారావు చిత్రానికి ఆ తేదీలో ఛాన్స్ లేనట్లే. అలాగని ఏప్రిల్ 14న కూడా ఈ సినిమా పక్కా ఏమీ కాదు. ఎందుకంటే అదే రోజుకు కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రం షెడ్యూల్ అయి ఉంది. ఆ సినిమాను ఆ తేదీకి ఎప్పుడో ఖాయం చేశారు. ఇప్పుడు మరోసారి చిత్ర బృందం ఏప్రిల్ 14 రిలీజ్ కన్ఫమ్ చేసింది. కేజీఎఫ్-2 మీద తెలుగులో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాక అవతల కూడా రామారావు సినిమాకు చాలా కష్టమవుతుంది. పోటీ తట్టుకోవడం ఈజీ కాదు. కాబట్టి ఆ తేదీన కూడా రామారావు రావడం కష్టమే. అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా అయింది పరిస్థితి. కాబట్టి కొత్తగా ఇంకో డేట్ చూసుకోక తప్పదు.
This post was last modified on February 2, 2022 11:19 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…