హీరోల్ని సినిమాలకు ఒప్పించడం కష్టమైపోతోంది. చేతిలో ఒకట్రెండు హిట్లుంటే.. మరింత బెట్టు చేస్తున్నారు. వాళ్లెవ్వరికీ కథలు ఓ పట్టాన నచ్చడం లేదు. వచ్చిన క్రేజ్ కాపాడుకోవాలి కదా, ఆ మాత్రం జాగ్రత్త అవసరం కూడా.
పీవీపీ దగ్గర ఓ కథ ఉంది. కథంటే సొంత కథ కాదు. ‘ఓ మై కడవులే’ అనే ఓ తమిళ సినిమా రైట్స్ కొనేసింది పీవీపీ. దాన్ని ఇద్దరు ముగ్గురు హీరోలకు వినిపించారు. వాళ్లు నో అనేసరికి… విశ్వక్ సేన్ దగ్గరకు చేరింది.
ఇదో యువ జంట కథ. పెళ్లి, విడాకులు.. ఈ విషయంలో ఈతరం ఆలోచనలు ఎలా ఉన్నాయన్నదాన్ని సెటైరికల్గా చూపించారు. మధ్యలో దేవుడి వ్యవహారం ఉంటుంది. విజయ్సేతుపతి పోర్షన్ ఒక్కటే కాస్త జనరంజకంగా ఉంటుంది. తెలుగులో తీయాలంటే చాలా మార్పులు చేయాలి. అందుకే విశ్వక్ నో చెప్పాడని టాక్.
విశ్వక్పై ఆశలు పెట్టుకున్న పీవీపీ… ఇప్పుడు మరో హీరో కోసం అన్వేషణ మొదలెట్టేసిందని తెలుస్తోంది.
This post was last modified on June 14, 2020 1:58 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…