ఒక సినిమా థియేటర్లలో ఎప్పుడు రిలీజవుతుందా ఆసక్తి చూసేవాళ్లు ఒక వర్గం అయితే.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఏ చిత్రం ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజవుతుందా అని చూసేవాళ్లు ఇంకో వర్గం తయారయ్యారు. కొన్నేళ్ల నుంచి డిజిటల్ రైట్స్ ద్వారా సినిమాలకు కొత్త మార్కెట్ ఏర్పడి మంచి ఆదాయమే వస్తోంది. ఆ ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది కూడా. ఓటీటీల హవా రోజు రోజుకూ పెరుగుతూ.. ప్రేక్షకులు వాటికి బాగానే అలవాటు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు మన ప్రేక్షకులు బాగా ఆసక్తి కనబరిచే తమిళ, హిందీ చిత్రాల్లో ఏది ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతోందో ఒకసారి చూద్దాం.ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ డీల్ ఎప్పుడో పూర్తయింది. ఆ చిత్రం హిందీ వరకు నెట్ ఫ్లిక్స్లో రిలీజవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లు జీ-5లో విడుదలవుతాయి. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెలన్నరకు ఈ చిత్రం ఓటీటీల్లో వస్తుందని సమాచారం.
తెలుగులో రిలీజ్ కాబోతున్న ఇంకో రెండు క్రేజీ సినిమాలు ఆచార్య, సర్కారు వారి పాట చిత్రాలకు అమేజాన్ ప్రైమ్తో డీల్ ఓకే అయింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు ఇవి ఓటీటీ బాట పట్టబోతున్నాయి. అమేజాన్ ప్రైమ్లో వేరే భాషలకు సంబంధించి కొన్ని హిందీ చిత్రాలు కూడా రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత అమితాసక్తిని రేకెత్తిస్తున్న ‘కేజీఎఫ్-2’ సైతం రిలీజైన నెలన్నరకు ప్రైమ్లో వస్తుంది.
అలాగే హిందీ సినిమాలు జయేష్బా జోర్దార్, షంషేరా, పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, హీరోపంటి-2 కూడా అమేజాన్ ప్రైమ్లోనే రాబోతున్నాయి. ఇక జీ ఓటీటీ మరికొన్ని ఆసక్తికర చిత్రాలను రిలీజ్ చేయబోతోంది. అజిత్ భారీ చిత్రం వలిమై, విశాల్ మూవీ సామాన్యుడు కూడా అందులోనే రిలీజవుతాయి. ఇక తమిళంలో సూర్య సినిమా ఈటీ, విజయ్ మూవీ బీస్ట్, శివ కార్తికేయన్ చిత్రం డాన్లకు నెట్ ఫ్లిక్స్తో డీల్ ఓకే అయింది. హిందీలో ఆమిర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా, షాహిద్ చిత్రం జెర్సీ కూడా నెట్ ఫ్లిక్స్లోనే వస్తాయి.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…