మొత్తానికి మళ్లీ టాలీవుడ్లో రిలీజ్ డేట్ల జాతర మొదలైంది. కరోనా మూడో వేవ్ ప్రభావం అనుకున్న స్థాయిలో లేకపోవడంతో వేసవి సినిమాలకు ఇబ్బంది లేదని ఫిక్సయి.. వరుసగా ఒక్కో భారీ చిత్రానికి రిలీజ్ డేట్లు ప్రకటించడం మొదలైంది. ఆర్ఆర్ఆర్ను మార్చి 25కు ఖరారు చేయగా.. సర్కారు వారి పాట మే 12కు ఖాయమైంది. భీమ్లా నాయక్ను వీలైతే ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామంటున్నారు.
మరోవైపు ఏప్రిల్ 1కి అనుకున్న ఆచార్య సినిమాను ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ మార్చి 25న వస్తున్న నేపథ్యంలో ఈ మార్పు అని వెల్లడించారు. ఇక్కడిదాకా లైనప్ అంతా బాగానే ఉంది. మంచి అండర్స్టాండింగ్తోనే డేట్లు సర్దుబాటు చేసుకున్నట్లుగా అనిపించింది.
కానీ ఇంతలో ఎఫ్-3 సినిమా లైన్లోకి వచ్చింది. ఆ చిత్రాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 29న ఆచార్య ఉండగా.. ముందు రోజు మరో పెద్ద సినిమాను ఎలా రిలీజ్ చేస్తారన్నది ప్రశ్నార్థకం. ఇది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ప్రకటించిన రిలీజ్ డేట్ లాగా లేదు. ఎక్కడో మిస్ అండర్ స్టాండింగ్, కమ్యూనికేషన్ జరిగినట్లుగా అనిపిస్తోంది. ఆచార్య సినిమాను నైజాం ఏరియాలో దిల్ రాజు ప్రధాన ప్రత్యర్థిగా మారిన వరంగల్ శీను రిలీజ్ చేస్తున్నాడు.
అందుకే రాజు పట్టుదలకు పోయి కావాలనే ఎఫ్-3 సినిమాను ఒక రోజు ముందు షెడ్యూల్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా వ్యవహరిస్తూ, రిలీజ్ డేట్ల విషయంలో కూడా అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్న దిల్ రాజు.. ఆల్రెడీ ఆచార్యకు ఏప్రిల్ 29 రిలీజ్ డేట్ ఖరారయ్యాక ఇలా తన సినిమాను పోటీకి దింపడమేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి రాజు ఆలోచనేంటో మరి. ఆ సినిమా డేట్ మారొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on February 1, 2022 9:31 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…