ఈ మధ్య యూట్యూబ్లో కొన్నివెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి.. 30 వెడ్స్ 21. కొత్త టాలెంట్కు ముందు నుంచి మంచి ప్రోత్సాహాన్నందిస్తూ ఫీల్ గుడ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్కు పేరుబపడ్డ ఛాయ్ బిస్కెట్ సంస్థ నుంచి గత ఏడాది వచ్చిన అందమైన వెబ్ సిరీస్ ఇది.
30 ఏళ్ల వయసున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తనకంటే తొమ్మిదేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవడం.. వయసు అంతరం విషయంలో ఇబ్బంది పడటం.. దీని వల్ల ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం.. సంసార జీవితంలో చిన్నపాటి కల్లోలం రావడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య నెమ్మదిగా గొడవ సద్దుమణిగి ఒక్కటవ్వడం.. ఈ నేపథ్యంలో నడుస్తుందీ సిరీస్. ఆహా ఓహో అనిపించే సిరీస్ కాదు కానీ.. ప్రతి ఎపిసోడ్ ఆహ్లాదంగా.. సరదాగా సాగిపోవడంతో ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
ఒక్కో ఎపిసోడ్ రిలీజవుతుంటే ఈ సిరీస్కు ఆదరణ అంతకంతకూ పెరిగిపోయి యూట్యూబ్లో ఇదొక బ్లాక్ బస్టర్ అయిపోయింది. సీజన్-1 ముగిసినపుడు అయ్యో అప్పుడే అయిపోయిందా అనుకున్నారు. అదే సమయంలో రెండో సీజన్ రాబోతోందని అప్ డేట్ ఇవ్వడంతో ప్రేక్షకులు సంతోషించారు. కొన్ని నెలలు టైం తీసుకుని ఇప్పుడు సీజన్-2ను రెడీ చేసేసింది ఛాయ్ బిస్కెట్ సంస్థ. ఒక చిన్న ప్రి టీజర్తో ఈ విషయాన్ని వెల్లడించింది.
త్వరలోనే ఫుల్ టీజర్ వదలబోతున్నారు. వచ్చే నెలలోనే రెండో సీజన్ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సిరీస్లో పృథ్వీ, మేఘనలుగా లీడ్ రోల్స్ చేసిన చైతన్య రావు, అనన్యలకు ఎంత పేరొచ్చిందో తెలిసిందే. ఇద్దరికీ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. దర్శకుడు, రచయితలు కూడా మంచి పేరే సంపాదించారు.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం సీజన్-2 కోసం ఎదురు చూస్తున్నట్లు మెసేజ్ పెట్టడం విశేషం. మరి తొలి సీజన్ తర్వాత పెరిగిన అంచనాలను 30 వెడ్స్ 21 టీం ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on January 31, 2022 8:02 am
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…