మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో కొన్నేళ్ల కిందట మాంచి ఊపులో కనిపించాడు సీనియర్ హీరో నాగార్జున. కెరీర్లో ఆ దశలో అలాంటి హై చూస్తారని ఆయన ఊహించి ఉండరు. అలాగే రెండేళ్లు తిరిగేసరికి ఆఫీసర్ లాంటి సినిమాతో కెరీర్లోనే అత్యంత పేలవమైన దశను చూస్తానని కూడా ఆయన అంచనా వేసి ఉండరు. గత ఏడాది ఆయన్నుంచి వచ్చిన మన్మథుడు-2 కూడా పెద్ద డిజాస్టరే అయింది. ఇప్పుడాయన క్రాస్ రోడ్స్లో నిలబడి ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆయన కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియడం లేదు. మహర్షికి రచయితగా పని చేసిన సాల్మన్కు దర్శకుడిగా తొలి అవకాశం ఇస్తూ వైల్డ్ డాగ్ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు నాగ్. చడీచప్పుడు కాకుండా ఈ సినిమాను మొదలుపెట్టి చివరి దశకు తీసుకొచ్చాడు నాగ్.
లాక్ డౌన్ లేకుంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజయ్యేదేమో కూడా. ఐతే వైల్డ్ డాగ్ సంగతేమో కానీ.. ఈలోపు నాగ్ తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆయన కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించబోతున్నాడు. గరుడవేగ స్టయిల్లోనే ఒక కొత్త తరహా థ్రిల్లర్ కథ చెప్పి నాగ్ను మెప్పించాడట ప్రవీణ్. ఈ చిత్రం కోసం రెండు పెద్ద సంస్థలు చేతులు కలుపుతున్నాయి. నాగ్ తనయుడు నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాను నిర్మించిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. పవన్ కళ్యాన్తో వరుసగా మూడు సినిమాలు తీసిన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
This post was last modified on June 13, 2020 10:57 pm
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఆయన పార్లమెంటులో…
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…
తమిళ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును టీవీకే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి హైదరాబాద్ పర్యటన సాంతం ఆసక్తికరంగానే సాగింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ……