సినీ రంగంలో కథానాయికగా నిలదొక్కుకోవాలంటే అందం ఫస్ట్ క్వాలిటీ. ఆ అందంలో కూడా ముందుగా చూసేది రంగుని. శరీర సౌష్టవం ఎంత బాగున్నా సరైన రంగు లేకుంటే శీత కన్ను తప్పవు. చాలా కొద్దిమంది మాత్రమే యావరేజ్ కలర్తో కథానాయికలుగా రాణించారు. కెరీర్ ఆరంభంలో ఓ మోస్తరు రంగులో ఉన్నప్పటికీ.. తర్వాత స్కిన్ ట్రీట్మెంట్ చేయించునో, ఇంకోటో చేసుకుని రంగు మెరుగుపరుచుకుంటారు.
ఇందుకు ఇలియానా, పూజా హెగ్డే లాంటి వాళ్లు ఉదాహరణ. ఐతే వీరితో పోలిస్తే డింపుల్ హయతి మరింత రంగు తక్కువ. తెలుగులో రవితేజ సరసన ‘ఖిలాడి’ లాంటి పెద్ద సినిమాలో.. అలాగే తమిళంలో విశాల్కు జోడీగా ‘వీరమే వాగై సూడుం’ లాంటి క్రేజీ మూవీలో ఆమె కథానాయికగా నటించింది. ఈ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఐతే ఇప్పుడైతే అవకాశాలు బాగానే వస్తున్నాయని.. కానీ కెరీర్ ఆరంభంలో తన రంగు తనకు సమస్యగా మారిందని డింపుల్ వెల్లడించింది.
‘‘నేను కొంచెం తక్కువ రంగున్న అమ్మాయిని. పరిశ్రమలో రంగుకి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ‘గద్దలకొండ గణేష్’లో సూపర్ హిట్టు పాట చేయడానికి ముందు చాలా సినిమా కార్యాలయాలకు వెళ్లాను. ఎన్నిసార్లు నాకు తిరస్కారాలు ఎదురయ్యాయో లెక్క లేదు. నాతో నేరుగా అనేవాళ్లు కాదు కానీ.. నేను వెళ్లిపోయాక నల్లగా ఉన్నానని, ఫెయిర్ స్కిన్ ఉండాలని కామెంట్లు చేసేవారని తెలిసింది. అప్పుడు చాలా బాధ పడేదాన్ని.
నిరాశలో ఉన్న టైంలో ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో పాట చేసే అవకాశం వచ్చింది. ఆ పాట నా కెరీర్కు చాలా ప్లస్ అయింది. పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. కానీ ఆ అవకాశాల్లో చాలా వరకు ఐటెం సాంగ్సే. అవే చేసుకుంటూ పోతే ఒక ముద్ర పడిపోతుందని.. నేను కోరుకున్నట్లు కథానాయికగా ఎదగలేనని, హీరోలకు జోడీగా నటించలేనని అర్థమై వాటన్నంటినీ తిరస్కరించా. ఓపిగ్గా ఎదురు చూశాక ‘ఖిలాడి’ సహా మంచి సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది’’ అని డింపుల్ హయతి వివరించింది.
This post was last modified on January 30, 2022 4:33 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…