మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమాలో నటించనున్నారు. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవే కాకుండా.. టైగర్ నాగేశ్వరావు సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు.
అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్న ఈ సినిమాను వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కథ రవితేజకి బాగా నచ్చిందట. వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారని సమాచారం. అయితే కథ ప్రకారం.. ఇందులో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుందట. ఆ రోల్ కోసం నటి రేణుదేశాయ్ ను తీసుకోవాలని చూస్తున్నారు.
నిజానికి ఆమె నటిగా సినిమాలు చేసి చాలా కాలమవుతుంది.
ఈ మధ్యకాలంలో టీవీ షోలకు జడ్జిగా కనిపించింది. ఇదే సమయంలో ఆమెకి కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. ఇప్పుడు రవితేజ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ అంటూ దర్శకనిర్మాతలు ఆమెని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.
కానీ ఆమెని ఆన్ బోర్డ్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఆమె గనుక ప్రాజెక్ట్ లో భాగమైతే సినిమాకి మంచి హైప్ రావడం ఖాయం. ఇక ఈ సినిమాలో రవితేజ పక్క ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారని టాక్. అలానే కొందరు పేరున్న సెలబ్రిటీలను ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు. ఇదిఒక పీరియాడిక్ డ్రామా. అరవైవ దశకంలో జరిగిన స్టోరీ. అయితే రవితేజను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దాలని చూస్తున్నారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…