మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమాలో నటించనున్నారు. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవే కాకుండా.. టైగర్ నాగేశ్వరావు సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు.
అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్న ఈ సినిమాను వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కథ రవితేజకి బాగా నచ్చిందట. వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారని సమాచారం. అయితే కథ ప్రకారం.. ఇందులో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుందట. ఆ రోల్ కోసం నటి రేణుదేశాయ్ ను తీసుకోవాలని చూస్తున్నారు.
నిజానికి ఆమె నటిగా సినిమాలు చేసి చాలా కాలమవుతుంది.
ఈ మధ్యకాలంలో టీవీ షోలకు జడ్జిగా కనిపించింది. ఇదే సమయంలో ఆమెకి కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. ఇప్పుడు రవితేజ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ అంటూ దర్శకనిర్మాతలు ఆమెని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.
కానీ ఆమెని ఆన్ బోర్డ్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఆమె గనుక ప్రాజెక్ట్ లో భాగమైతే సినిమాకి మంచి హైప్ రావడం ఖాయం. ఇక ఈ సినిమాలో రవితేజ పక్క ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారని టాక్. అలానే కొందరు పేరున్న సెలబ్రిటీలను ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు. ఇదిఒక పీరియాడిక్ డ్రామా. అరవైవ దశకంలో జరిగిన స్టోరీ. అయితే రవితేజను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దాలని చూస్తున్నారు.
This post was last modified on January 29, 2022 12:40 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…