మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమాలో నటించనున్నారు. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవే కాకుండా.. టైగర్ నాగేశ్వరావు సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు.
అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్న ఈ సినిమాను వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కథ రవితేజకి బాగా నచ్చిందట. వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారని సమాచారం. అయితే కథ ప్రకారం.. ఇందులో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుందట. ఆ రోల్ కోసం నటి రేణుదేశాయ్ ను తీసుకోవాలని చూస్తున్నారు.
నిజానికి ఆమె నటిగా సినిమాలు చేసి చాలా కాలమవుతుంది.
ఈ మధ్యకాలంలో టీవీ షోలకు జడ్జిగా కనిపించింది. ఇదే సమయంలో ఆమెకి కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. ఇప్పుడు రవితేజ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ అంటూ దర్శకనిర్మాతలు ఆమెని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.
కానీ ఆమెని ఆన్ బోర్డ్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఆమె గనుక ప్రాజెక్ట్ లో భాగమైతే సినిమాకి మంచి హైప్ రావడం ఖాయం. ఇక ఈ సినిమాలో రవితేజ పక్క ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారని టాక్. అలానే కొందరు పేరున్న సెలబ్రిటీలను ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు. ఇదిఒక పీరియాడిక్ డ్రామా. అరవైవ దశకంలో జరిగిన స్టోరీ. అయితే రవితేజను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దాలని చూస్తున్నారు.
This post was last modified on January 29, 2022 12:40 pm
వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…
థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…
ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్ సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలే ఈ…
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…
ఔను… ఇది నిజమే. విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం..…
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల…