మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి కీర్తి సురేష్ను ఎంచుకున్నపుడు చాలామంది అవాక్కయ్యారు. నేను శైలజ సినిమాలో మూడీగా కనిపిస్తూ పెద్దగా నటనే రానట్లు కనిపించిన అమ్మాయితో సావిత్రి పాత్ర చేయించడం ఏంటి అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సావిత్రిని అనుకరించడానికైనా ఒక స్థాయి ఉండొద్దా అన్నారు.
నిత్య మీనన్ లాంటి వాళ్లే ఈ పాత్రకు కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. కానీ తన గురించి నెగెటివ్గా మాట్లాడిన అందరూ ముక్కున వేలేసుకుని చూసేలా చేసింది కీర్తి. మహానటిలో ఆమె అభినయానికి ఆశ్చర్యపోని వారు లేరు. ఆ సినిమాతో కీర్తికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకోవడమే కాక.. మంచి మార్కెట్ కూడా సంపాదించింది. ఈ దెబ్బతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల కథలు ఆమెను వెతుక్కుంటూ వచ్చేశాయి. కానీ వాటిలోంచి సరైన కథల్ని ఎంచుకోవడంలోనే కీర్తి తడబడింది.
తనను లీడ్ రోల్లో పెట్టి పేరున్న దర్శకులు, నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకొచ్చేసరికి కీర్తి ఎగ్జైట్ అయిపోయినట్లుంది తప్ప.. వీటిలో తన ఇమేజ్ను నిలబెట్టేవి, పెంచేవి ఏవి అని చూడలేదు. ఇంతకుముందు వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా.. ఇప్పుడొచ్చిన గుడ్ లక్ సఖి.. వీటిలో కనీస స్థాయిలో చెప్పుకునే సినిమా ఒక్కటీ లేదు.
మూడూ ఒకదాన్ని మించి ఇంకోటి చెత్త సినిమా. ముందుగా పెంగ్విన్ చూసి ఇదేం సినిమా అనుకుంటే.. ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా చూసి ముందుదే బెటర్ అనిపించింది. ఇప్పుడు గుడ్ లక్ సఖి చూసి పెంగ్విన్ దీంతో పోలిస్తే చాలా మెరుగు అనుకుంటున్నారు. మరీ ఇంత పేలవమైన కథల్ని కీర్తి ఎలా ఓకే చేసి సినిమాలు చేసేసిందో అర్థం కాదు. కాస్తో కూస్తో ఉన్న పేరును గుడ్ లక్ సఖి పూర్తిగా చెడగొట్టేసినట్లే. మహానటితో వచ్చిన గుర్తింపంతా పోయినట్లే. ఇక కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే ప్రేక్షకులు ఒక దండం పెట్టేసేలా ఉన్నారు.
This post was last modified on January 28, 2022 8:28 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…