మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి కీర్తి సురేష్ను ఎంచుకున్నపుడు చాలామంది అవాక్కయ్యారు. నేను శైలజ సినిమాలో మూడీగా కనిపిస్తూ పెద్దగా నటనే రానట్లు కనిపించిన అమ్మాయితో సావిత్రి పాత్ర చేయించడం ఏంటి అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సావిత్రిని అనుకరించడానికైనా ఒక స్థాయి ఉండొద్దా అన్నారు.
నిత్య మీనన్ లాంటి వాళ్లే ఈ పాత్రకు కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. కానీ తన గురించి నెగెటివ్గా మాట్లాడిన అందరూ ముక్కున వేలేసుకుని చూసేలా చేసింది కీర్తి. మహానటిలో ఆమె అభినయానికి ఆశ్చర్యపోని వారు లేరు. ఆ సినిమాతో కీర్తికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకోవడమే కాక.. మంచి మార్కెట్ కూడా సంపాదించింది. ఈ దెబ్బతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల కథలు ఆమెను వెతుక్కుంటూ వచ్చేశాయి. కానీ వాటిలోంచి సరైన కథల్ని ఎంచుకోవడంలోనే కీర్తి తడబడింది.
తనను లీడ్ రోల్లో పెట్టి పేరున్న దర్శకులు, నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకొచ్చేసరికి కీర్తి ఎగ్జైట్ అయిపోయినట్లుంది తప్ప.. వీటిలో తన ఇమేజ్ను నిలబెట్టేవి, పెంచేవి ఏవి అని చూడలేదు. ఇంతకుముందు వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా.. ఇప్పుడొచ్చిన గుడ్ లక్ సఖి.. వీటిలో కనీస స్థాయిలో చెప్పుకునే సినిమా ఒక్కటీ లేదు.
మూడూ ఒకదాన్ని మించి ఇంకోటి చెత్త సినిమా. ముందుగా పెంగ్విన్ చూసి ఇదేం సినిమా అనుకుంటే.. ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా చూసి ముందుదే బెటర్ అనిపించింది. ఇప్పుడు గుడ్ లక్ సఖి చూసి పెంగ్విన్ దీంతో పోలిస్తే చాలా మెరుగు అనుకుంటున్నారు. మరీ ఇంత పేలవమైన కథల్ని కీర్తి ఎలా ఓకే చేసి సినిమాలు చేసేసిందో అర్థం కాదు. కాస్తో కూస్తో ఉన్న పేరును గుడ్ లక్ సఖి పూర్తిగా చెడగొట్టేసినట్లే. మహానటితో వచ్చిన గుర్తింపంతా పోయినట్లే. ఇక కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే ప్రేక్షకులు ఒక దండం పెట్టేసేలా ఉన్నారు.
This post was last modified on January 28, 2022 8:28 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…