బాహుబలి అనే ఒకే సినిమాతో ప్రభాస్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒక్క సినిమాతో ఇంతలా ఎదిగిపోయిన హీరోలు ఇండస్ట్రీ ఫిలిం హిస్టరీలోనే ఎవ్వరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ డిజాస్టర్ అయినా సరే.. అతడి క్రేజ్ ఏమీ తగ్గలేదు. ప్రభాస్కు డిమాండ్ ఇంకా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. అతను హీరోగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కె, స్పిరిట్ లాంటి భారీ చిత్రాలు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇందులో ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ సినిమా విడుదలకు సన్నాహాలు భారీ ఎత్తునే జరుగుతున్నట్లు సమాచారం. ప్రభాస్ క్రేజుని పూర్తిగా వాడుకుంటూ పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాకు భారీ రిలీజ్ ప్లాన్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఏకంగా 15 భాషల్లో ‘ఆదిపురుష్’ విడుదల కాబోతోందట. అంటే దాదాపు ప్రతి ప్రధాన భాషలోనూ సినిమా రిలీజవుతుందన్నమాట. ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమాలంటే నాలుగైదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు అంతే. నార్త్ ఇండియా అంతటా హిందీలో రిలీజ్ చేసి.. సౌత్ వరకు ఇక్కడి నాలుగు ప్రధాన భాషల్లో సినిమాను విడుదల చేస్తారు. కానీ ‘ఆదిపురుష్’ రామాయణ కథతో తెరకెక్కిన నేపథ్యంలో ఆయా లోకల్ భాషల్లో అందిస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో డబ్ చేస్తున్నారట.
అలాగే ప్రపంచ స్థాయిలో కూడా ఇంగ్లిష్ మాత్రమే కాక చైనీస్, జపనీస్.. ఇలా పలు భాషల్లో సినిమాను అందించబోతున్నారట. వరల్డ్ వైడ్ ఈ చిత్రాన్ని 20 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే అత్యధిక స్క్రీన్లలో విడుదలైన భారతీయ చిత్రంగా ‘ఆదిపురుష్’ రికార్డు సృష్టించబోతోందన్నమాటే. చాలా ముందుగానే షూటింగ్ పూర్తి చేసి సుదీర్ఘ సమయం పోస్ట్ ప్రొడక్షన్ కోసం వెచ్చిస్తోంది చిత్ర బృందం. ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 28, 2022 6:58 pm
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…