యువ కథానాయకుల్లో శ్రీ విష్ణు రూటే వేరు. అతను రొటీన్ సినిమాలు చేయడు. ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. మధ్య మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుున్నా తట్టుకుని తన దారిలోనే తాను ప్రయత్నిస్తూ వచ్చాడు. ఐతే ఈ మధ్య అతడి బ్రాండు దెబ్బ తింటూ వస్తోంది. బ్రోచేవారెవరురా తర్వాత అతడికి ఆశించిన ఫలితాలు దక్కట్లేదు.
తిప్పరా మీసం, గాలి సంపత్, అర్జున ఫల్గుణ డిజాస్టర్లు కాగా.. రాజ రాజ చోర కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాల ప్రోమోలు చూస్తే ఆహా ఓహో అన్నట్లు అనిపించాయి. కానీ ‘రాజ రాజ చోర’ మినహా చిత్రాలకు బొమ్మ పూర్తిగా తిరగబడిపోయింది. సినిమాల్లో అస్సలు విషయం లేక తుస్సుమనిపించాయి. దీంతో క్రమంగా శ్రీ విష్ణు పేరు దెబ్బ తింటోంది. ఈ నేపథ్యంలో కేవలం ప్రోమోలతో మెరుపులు మెరిపించడమే కాక సినిమాతోనూ సత్తా చాటాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు శ్రీ విష్ణు.
విష్ణు నుంచి త్వరలో రాబోతున్న కొత్త సినిమా.. భళా తందనాన. ఈ సారి కూడా వెరైటీ టైటిల్తో వస్తున్నాడు విష్ణు. ఇంతకుముందు బాణం, బసంతి సినిమాలు రూపొందించిన చైతన్య దంతులూరి ఈ సినిమాను రూపొందించాడు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి.. మధ్యలో వరుస ఫ్లాపులతో వెనక్కి తగ్గిన సీనియర్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. పెట్రేగిపోతున్న రాజకీయ నాయకులపై మారు వేషం వేసుకుని పోరాడే కుర్రాడి పాత్రలో శ్రీవిష్ణు కనిపించబోతున్నాడు. చాలాసార్లు చూసిన కథలా అనిపించినా.. ట్రీట్మెంట్ కొత్తగా అనిపిస్తోంది. టీజర్లో డైలాగులు బాగానే పేలాయి. విష్ణు సినిమాకు తొలిసారి కొంచెం మాస్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోలు చేయాల్సిన కథలో అతను చేసినట్లున్నాడు. కాకపోతే ఇలా ప్రోమోలతో సరిపెట్టకుండా సినిమాలోనూ మెరుపులుంటే బాగుంటుంది. ఈసారైనా విష్ణు అంచనాలను అందుకుని మంచి సినిమాను అందిస్తాడేమో చూడాలి. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 28, 2022 1:25 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…