యువ కథానాయకుల్లో శ్రీ విష్ణు రూటే వేరు. అతను రొటీన్ సినిమాలు చేయడు. ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. మధ్య మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుున్నా తట్టుకుని తన దారిలోనే తాను ప్రయత్నిస్తూ వచ్చాడు. ఐతే ఈ మధ్య అతడి బ్రాండు దెబ్బ తింటూ వస్తోంది. బ్రోచేవారెవరురా తర్వాత అతడికి ఆశించిన ఫలితాలు దక్కట్లేదు.
తిప్పరా మీసం, గాలి సంపత్, అర్జున ఫల్గుణ డిజాస్టర్లు కాగా.. రాజ రాజ చోర కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాల ప్రోమోలు చూస్తే ఆహా ఓహో అన్నట్లు అనిపించాయి. కానీ ‘రాజ రాజ చోర’ మినహా చిత్రాలకు బొమ్మ పూర్తిగా తిరగబడిపోయింది. సినిమాల్లో అస్సలు విషయం లేక తుస్సుమనిపించాయి. దీంతో క్రమంగా శ్రీ విష్ణు పేరు దెబ్బ తింటోంది. ఈ నేపథ్యంలో కేవలం ప్రోమోలతో మెరుపులు మెరిపించడమే కాక సినిమాతోనూ సత్తా చాటాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు శ్రీ విష్ణు.
విష్ణు నుంచి త్వరలో రాబోతున్న కొత్త సినిమా.. భళా తందనాన. ఈ సారి కూడా వెరైటీ టైటిల్తో వస్తున్నాడు విష్ణు. ఇంతకుముందు బాణం, బసంతి సినిమాలు రూపొందించిన చైతన్య దంతులూరి ఈ సినిమాను రూపొందించాడు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి.. మధ్యలో వరుస ఫ్లాపులతో వెనక్కి తగ్గిన సీనియర్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. పెట్రేగిపోతున్న రాజకీయ నాయకులపై మారు వేషం వేసుకుని పోరాడే కుర్రాడి పాత్రలో శ్రీవిష్ణు కనిపించబోతున్నాడు. చాలాసార్లు చూసిన కథలా అనిపించినా.. ట్రీట్మెంట్ కొత్తగా అనిపిస్తోంది. టీజర్లో డైలాగులు బాగానే పేలాయి. విష్ణు సినిమాకు తొలిసారి కొంచెం మాస్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోలు చేయాల్సిన కథలో అతను చేసినట్లున్నాడు. కాకపోతే ఇలా ప్రోమోలతో సరిపెట్టకుండా సినిమాలోనూ మెరుపులుంటే బాగుంటుంది. ఈసారైనా విష్ణు అంచనాలను అందుకుని మంచి సినిమాను అందిస్తాడేమో చూడాలి. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…