కాస్త పేరున్న ఏ హీరోయిన్ అయినా ఏదో ఒక దశలో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించక తప్పట్లేదు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందా.. మీకు ఏవైనా అలాంటి ఇబ్బందికర అనుభవాలున్నాయా అన్న ప్రశ్నలు మీడియా వాళ్ల నుంచి రాక మానవు. ఈ ప్రశ్నలకు ఒక్కో హీరోయిన్ ఒక్కోలా స్పందిస్తుంటుంది. తాజాగా నటి తేజస్వి కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడింది.
ముంబయి హీరోయిన్ల మీద ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని, కమిట్మెంట్ పేరుతో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్లను లైంగికంగా లొంగదీసుకుంటున్నారని.. వాళ్ళు చెప్పిన కమిట్మెంట్లకు ఓకే చెబితేనే అవకాశాలు ఇస్తారని తేజస్వి కుండబద్దలు కొట్టేసింది. తనను ఎంతోమంది నేరుగా కమిట్మెంట్ ఇస్తావా అని అడిగినట్లు తేజస్వి వెల్లడించింది.
అసలు ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే ముందు కమిట్మెంట్ కోసం అడిగేవాళ్లే కనిపిస్తారని.. వాళ్లందరినీ దాటి వెళ్తేనే అసలైన సినిమా వాళ్లు కనిపిస్తారన్న తేజస్వి.. ముంబయి హీరోయిన్ల వల్ల మన అమ్మాయిలకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముంబయి హీరోయిన్లు అన్నింటికీ సిద్ధంగా ఉంటారు కాబట్టే వారికే అవకాశాలు ఇస్తున్నారని.. అవకాశాల కోసం పడక సుఖం ఇవ్వాలని వాళ్లకు ముందే తెలుసని, వాళ్లు ప్రిపేరయ్యే ఇక్కడికి వస్తారని.. అలాంటి వాళ్ల వల్లే తెలుగు హీరోయిన్కిలకు చెడ్డపేరు వస్తోందని తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇండస్ట్రీలో తనకు తెలిసిన హీరోయిన్లు చాలామందికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయని.. చాలామంది సిగ్గుపడి బయటకు చెప్పడం లేదని.. కాస్టింగ్ కౌచ్ వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని తేజస్వి చెప్పింది. గతంలో ఓ అబ్బాయితో డేటింగ్ చేశానని, అతడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యాక ఈ కాస్టింగ్ కౌచ్ అంశం వల్లే ఆ బంధం చెడిపోయిందని తేజస్వి ఆవేదన వ్యక్తం చేసింది.
This post was last modified on June 13, 2020 2:31 pm
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా…
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…