జనగణమన.. పూరి జగన్నాథ్ ఎన్నో ఏళ్ల కింద ప్రకటించిన సినిమా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ సినిమా తీయాలని ఆయన అనుకున్నారు. ‘బిజినెస్ మ్యాన్’ తర్వాత ఈ సినిమా చేయడానికి కొంత వరకు చర్చలు జరిగాయి. కానీ తర్వాత ఇద్దరూ వేర్వేరు కమిట్మెంట్లలో పడిపోవడం.. ఆపై పూరి ఫాంలో కోల్పోవడం.. వేరే కారణాలు కూడా తోడై ఈ చిత్రం ఎంతకీ పట్టాలెక్కలేదు.
చివరికి చూస్తే మహేష్కు ఈ సినిమా చేసే ఆసక్తి లేదని పూరికి అర్థమైంది. దీంతో వేరే హీరోతో ఈ సినిమా చేయడానికి ఆయన చూస్తున్నారు. ఐతే ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఈ కథను తెరకెక్కించడానికి ఆయన ఫిక్సయినట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. వీరి కలయికలో త్వరలోనే ‘లైగర్’ రాబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మళ్లీ కలిసి ఇంకో సినిమాచేయడానికి పూరి, విజయ్ ఫిక్సయినట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
నిజంగా వీళ్లిద్దరూ రెండో సినిమా చేయబోతుడటం పక్కా అయితే.. ఆ కథ ‘జగనణమన’నే అంటున్నారు. ‘లైగర్’ సినిమా విషయంలో ఇటు విజయ్, అటు పూరి పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఊపులోనే ‘జనగణమన’ చేయడానికి ఇద్దరూ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పటికి అంతా ఓకే అనుకున్నా.. ‘లైగర్’ ఫలితాన్ని బట్టే ఏదైనా ఆధారపడి ఉంటుంది.
ఆ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకుంటే.. వీరి కాంబినేషన్కు క్రేజ్ పోతుంది. అప్పుడు కొత్త సినిమా డోలాయమానంలో పడుతుంది. పూరి ఇంతకుముందు నితిన్తో ‘హార్ట్ ఎటాక్’ తర్వాత.. మహేష్తో ‘బిజినెస్ మ్యాన్’ తర్వాత.. బాలయ్యతో ‘పైసా వసూల్’ తర్వాత ఇంకో సినిమా ఉంటుందని ఊరించడం.. తర్వాత ఆయా చిత్రాలు అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఆ కాంబినేషన్లు రిపీట్ కాకపోవడం తెలిసిందే. మరి ‘లైగర్’ అయినా సక్సెస్ అయి ఇప్పుడు వార్తల్లో ఉన్న రిపీట్ కాంబినేషన్ నిజమవుతుందేమో.. ‘జనగణమన’ బయటికి వస్తుందేమో చూడాలి.
This post was last modified on January 27, 2022 7:53 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…