అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల గురించి ఆరు నెలల ముందు ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక రెండు నెలల పాటు దీని గురించి ఎంతో చర్చ జరిగాక తమ వివాహ నాలుగో వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ జంట విడాకుల గురించి అధికారికంగా ప్రకటించి అందరికీ పెద్ద షాకిచ్చింది. అప్పటిదాకా చైతూ, సమంత విడిపోతారా లేదా అన్న దాని మీదే చర్చ నడవగా.. అప్పట్నుంచి వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు.. ఇద్దరిలో ఎవరు విడాకుల ప్రతిపాదన తెచ్చారు అనే దాని మీద డిస్కషన్ సాగింది.
ఈ విషయంలో తానే బాధితురాలిని అన్నట్లుగా సమంత సోషల్ మీడియా పోస్టులు పెట్టడం చూసి అందరూ.. చైతూనే విలన్గా చూడటం మొదలుపెట్టారు. అతనే సమంత నుంచి బలవంతంగా విడిపోయాడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో ట్విస్ట్ వచ్చింది. విడాకులు కోరింత సమంతే అని.. చైతూ అందుకు సరే అన్నాడని నాగార్జున చెప్పి అందరినీ అయోమయంలో పడేశాడు.చాలామంది సెలబ్రెటీల్లాగే నాగ్ కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలను, కామెంట్లను తాను అస్సలు పట్టించుకోనని అంటుంటాడు కానీ.. అందులో చైతూపై నెగెటివిటీ చూశాకే ఆయన స్పందించినట్లు కనిపిస్తోంది.
సమంతతో విడిపోయే విషయంలో అందరూ తన కొడుకును విలన్గా చూస్తుండటంతోనే నాగ్ ఇలా మాట్లాడి ఉండొచ్చనిపిస్తోంది. ఐతే విడాకుల విషయంలో చైతూ తప్పేం లేదన్నట్లుగా మాట్లాడటంతో ఇప్పుడు అందరూ సమంత వైపు చూస్తున్నారు. దీనిపై ఆమె స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బేసిగ్గా చైతూ రిజర్వ్డ్. అతను దేనికీ స్పందించడు. సమంత దానికి పూర్తి రివర్స్. విడాకులు, తదనంతర పరిణామాలపై పరోక్ష పోస్టుల ద్వారా.. అలాగే బహిరంగ వేదికల్లో ఆమె ఇప్పటికే చాలా మాట్లాడింది.
ఇప్పుడు నాగ్ నింద తనపైకి తోసేసిన నేపథ్యంలో సమంత ఊరుకుని ఉంటుందని అనుకోలేం. ఆమె నుంచి గట్టి స్పందనే ఉండొచ్చు. విడాకులు అడిగింది నిజమే అయితే.. ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నానో వెల్లడించకుండా పోదు. అది క్రిప్టిక్ పోస్టుల ద్వారా కావచ్చు.. లేదా స్ట్రెయిట్గానే కావచ్చు. ఇప్పుడు కాకపోతే తర్వాత మీడియా వాళ్లను కలిసినపుడు దీనిపై ప్రశ్న ఎదురు కాకుండా పోదు. సమంత స్పందించకపోదు. మరి నాగ్ మాటకు ఆమె బదులేంటో?
This post was last modified on January 27, 2022 7:23 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…