అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల గురించి ఆరు నెలల ముందు ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక రెండు నెలల పాటు దీని గురించి ఎంతో చర్చ జరిగాక తమ వివాహ నాలుగో వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ జంట విడాకుల గురించి అధికారికంగా ప్రకటించి అందరికీ పెద్ద షాకిచ్చింది. అప్పటిదాకా చైతూ, సమంత విడిపోతారా లేదా అన్న దాని మీదే చర్చ నడవగా.. అప్పట్నుంచి వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు.. ఇద్దరిలో ఎవరు విడాకుల ప్రతిపాదన తెచ్చారు అనే దాని మీద డిస్కషన్ సాగింది.
ఈ విషయంలో తానే బాధితురాలిని అన్నట్లుగా సమంత సోషల్ మీడియా పోస్టులు పెట్టడం చూసి అందరూ.. చైతూనే విలన్గా చూడటం మొదలుపెట్టారు. అతనే సమంత నుంచి బలవంతంగా విడిపోయాడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో ట్విస్ట్ వచ్చింది. విడాకులు కోరింత సమంతే అని.. చైతూ అందుకు సరే అన్నాడని నాగార్జున చెప్పి అందరినీ అయోమయంలో పడేశాడు.చాలామంది సెలబ్రెటీల్లాగే నాగ్ కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలను, కామెంట్లను తాను అస్సలు పట్టించుకోనని అంటుంటాడు కానీ.. అందులో చైతూపై నెగెటివిటీ చూశాకే ఆయన స్పందించినట్లు కనిపిస్తోంది.
సమంతతో విడిపోయే విషయంలో అందరూ తన కొడుకును విలన్గా చూస్తుండటంతోనే నాగ్ ఇలా మాట్లాడి ఉండొచ్చనిపిస్తోంది. ఐతే విడాకుల విషయంలో చైతూ తప్పేం లేదన్నట్లుగా మాట్లాడటంతో ఇప్పుడు అందరూ సమంత వైపు చూస్తున్నారు. దీనిపై ఆమె స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బేసిగ్గా చైతూ రిజర్వ్డ్. అతను దేనికీ స్పందించడు. సమంత దానికి పూర్తి రివర్స్. విడాకులు, తదనంతర పరిణామాలపై పరోక్ష పోస్టుల ద్వారా.. అలాగే బహిరంగ వేదికల్లో ఆమె ఇప్పటికే చాలా మాట్లాడింది.
ఇప్పుడు నాగ్ నింద తనపైకి తోసేసిన నేపథ్యంలో సమంత ఊరుకుని ఉంటుందని అనుకోలేం. ఆమె నుంచి గట్టి స్పందనే ఉండొచ్చు. విడాకులు అడిగింది నిజమే అయితే.. ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నానో వెల్లడించకుండా పోదు. అది క్రిప్టిక్ పోస్టుల ద్వారా కావచ్చు.. లేదా స్ట్రెయిట్గానే కావచ్చు. ఇప్పుడు కాకపోతే తర్వాత మీడియా వాళ్లను కలిసినపుడు దీనిపై ప్రశ్న ఎదురు కాకుండా పోదు. సమంత స్పందించకపోదు. మరి నాగ్ మాటకు ఆమె బదులేంటో?
This post was last modified on January 27, 2022 7:23 pm
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…