అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల గురించి ఆరు నెలల ముందు ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక రెండు నెలల పాటు దీని గురించి ఎంతో చర్చ జరిగాక తమ వివాహ నాలుగో వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ జంట విడాకుల గురించి అధికారికంగా ప్రకటించి అందరికీ పెద్ద షాకిచ్చింది. అప్పటిదాకా చైతూ, సమంత విడిపోతారా లేదా అన్న దాని మీదే చర్చ నడవగా.. అప్పట్నుంచి వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు.. ఇద్దరిలో ఎవరు విడాకుల ప్రతిపాదన తెచ్చారు అనే దాని మీద డిస్కషన్ సాగింది.
ఈ విషయంలో తానే బాధితురాలిని అన్నట్లుగా సమంత సోషల్ మీడియా పోస్టులు పెట్టడం చూసి అందరూ.. చైతూనే విలన్గా చూడటం మొదలుపెట్టారు. అతనే సమంత నుంచి బలవంతంగా విడిపోయాడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో ట్విస్ట్ వచ్చింది. విడాకులు కోరింత సమంతే అని.. చైతూ అందుకు సరే అన్నాడని నాగార్జున చెప్పి అందరినీ అయోమయంలో పడేశాడు.చాలామంది సెలబ్రెటీల్లాగే నాగ్ కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలను, కామెంట్లను తాను అస్సలు పట్టించుకోనని అంటుంటాడు కానీ.. అందులో చైతూపై నెగెటివిటీ చూశాకే ఆయన స్పందించినట్లు కనిపిస్తోంది.
సమంతతో విడిపోయే విషయంలో అందరూ తన కొడుకును విలన్గా చూస్తుండటంతోనే నాగ్ ఇలా మాట్లాడి ఉండొచ్చనిపిస్తోంది. ఐతే విడాకుల విషయంలో చైతూ తప్పేం లేదన్నట్లుగా మాట్లాడటంతో ఇప్పుడు అందరూ సమంత వైపు చూస్తున్నారు. దీనిపై ఆమె స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బేసిగ్గా చైతూ రిజర్వ్డ్. అతను దేనికీ స్పందించడు. సమంత దానికి పూర్తి రివర్స్. విడాకులు, తదనంతర పరిణామాలపై పరోక్ష పోస్టుల ద్వారా.. అలాగే బహిరంగ వేదికల్లో ఆమె ఇప్పటికే చాలా మాట్లాడింది.
ఇప్పుడు నాగ్ నింద తనపైకి తోసేసిన నేపథ్యంలో సమంత ఊరుకుని ఉంటుందని అనుకోలేం. ఆమె నుంచి గట్టి స్పందనే ఉండొచ్చు. విడాకులు అడిగింది నిజమే అయితే.. ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నానో వెల్లడించకుండా పోదు. అది క్రిప్టిక్ పోస్టుల ద్వారా కావచ్చు.. లేదా స్ట్రెయిట్గానే కావచ్చు. ఇప్పుడు కాకపోతే తర్వాత మీడియా వాళ్లను కలిసినపుడు దీనిపై ప్రశ్న ఎదురు కాకుండా పోదు. సమంత స్పందించకపోదు. మరి నాగ్ మాటకు ఆమె బదులేంటో?
This post was last modified on January 27, 2022 7:23 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…