అల్లు కాంపౌండ్ లో అందరూ తమ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ‘పుష్ప’ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పార్ట్ 2 కోసం సిద్ధమవుతున్నారు. అల్లు అరవింద్ అటు సినిమాల నిర్మాణం, ఇటు ‘ఆహా’ పనులతో చాలా బిజీ. అల్లు బాబీ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నారు. ఆయన నిర్మించిన ‘గని’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు సిరీస్ కొత్త సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది. అందులో మరో హీరో కూడా ఉన్నాడని సమాచారం. అతడు మరెవరో కాదు.. నటుడు శ్రీవిష్ణు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతోంది. అయితే దీనికి డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ సినిమా మాత్రం ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
శ్రీవిష్ణు గతంలో కూడా ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. అలానే సోలో హీరోగా కూడా చేస్తున్నారు. కానీ అల్లు శిరీష్ తొలిసారి వేరే హీరోతో కలిసి నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాతోనైనా.. సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘ప్రేమ కాదంట’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈపాటికే విడుదల కావాల్సింది కానీ ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ సినిమాకి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఇందులో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పడిందని.. సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…