అల్లు కాంపౌండ్ లో అందరూ తమ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ‘పుష్ప’ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పార్ట్ 2 కోసం సిద్ధమవుతున్నారు. అల్లు అరవింద్ అటు సినిమాల నిర్మాణం, ఇటు ‘ఆహా’ పనులతో చాలా బిజీ. అల్లు బాబీ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నారు. ఆయన నిర్మించిన ‘గని’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు సిరీస్ కొత్త సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది. అందులో మరో హీరో కూడా ఉన్నాడని సమాచారం. అతడు మరెవరో కాదు.. నటుడు శ్రీవిష్ణు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతోంది. అయితే దీనికి డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ సినిమా మాత్రం ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
శ్రీవిష్ణు గతంలో కూడా ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. అలానే సోలో హీరోగా కూడా చేస్తున్నారు. కానీ అల్లు శిరీష్ తొలిసారి వేరే హీరోతో కలిసి నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాతోనైనా.. సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘ప్రేమ కాదంట’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈపాటికే విడుదల కావాల్సింది కానీ ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ సినిమాకి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఇందులో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పడిందని.. సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…