సెలబ్రెటీలు సరోగసీ ద్వారా బిడ్డల్ని కనడం కొత్తేమీ కాదు. బాలీవుడ్లో ఇలా బిడ్డల్ని కన్న జంటలు చాలానే ఉన్నాయి. ఈ విషయంలో విమర్శలకు కూడా లోటు లేదు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, బిడ్డలు పుట్టే అవకాశం లేని వాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఓకే కానీ.. అందం చెడిపోతుందనో, బిడ్డను తొమ్మిది నెలలు మోయడం కష్టమనో, పురిటి నొప్పులు భరించడానికి భయపడో ఈ మార్గం ఎంచుకోవడమే తప్పంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి.
సెలబ్రెటీలు సరోగసీ బాట పట్టినపుడల్లా ఈ విషయంలో పెద్ద చర్చ జరుగుతుంటుంది. తాజాగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడైన ఆమె భర్త నిక్ జోనాస్ కలిసి సరోగసీ మార్గంలో బిడ్డను కన్నట్లు సమాచారం బయటికి రాగానే సోషల్ మీడియాలో వీరిపై కౌంటర్లు పడ్డాయి. ఐతే ఇంటర్నెట్లో సాధారణ స్థాయి వ్యక్తులు చేసే కామెంట్లను పెద్దగా పట్టించుకోరు కానీ.. ఒక సెలబ్రెటీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం అది కచ్చితంగా అది చర్చనీయాంశమే.
ఇస్లాం మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడటంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్.. డబ్బున్న వాళ్లు సరోగసీ ద్వారా బిడ్డను కనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘‘ధనవంతులైన మహిళలు కూడా సరోగేట్ మామ్గా మారనంతవరకు నేను సరోగసీని ఒప్పుకొను. పురుషులు బుర్ఖాను వేసుకొనంత వరకు నేను దానిని సమర్థించను. సరోగసీ, బుర్ఖా అనేవి పేదలు,మహిళలను దోపిడి చేసేందుకే’’ అని తన ట్వీట్లో తస్లీమా పేర్కొంది.
ఐతే ఎక్కడా ప్రియాంక, నిక్ల పేర్లు ఎత్తకపోయినా.. వారు సరోగసీ ద్వారా బిడ్డను కన్నట్లు వార్త బయటికి వచ్చిన మరుసటి రోజే తస్లీమా ఈ ట్వీట్ వేయడంతో అగ్గి రాజుకుంది. ప్రియాంకను విమర్శిస్తావా అంటూ ఆమె అభిమానులు తస్లీమాపై దండయాత్రకు వచ్చారు. ఐతే తాను ప్రియాంక, నిక్లను ఉద్దేశించి ట్వీట్ చేయలేదని తస్లీమా స్పష్టం చేసింది. వాళ్లంటే తనకిష్టమని పేర్కొంటూ.. ప్రియాంకతో గతంలో ట్విట్టర్లో జరిపిన సంభాషణలు, ఒకరినొకరు అభినందించుకున్న ట్వీట్లు షేర్ చేసింది తస్లీమా. తనను ప్రియాంకకు వ్యతిరేకిగా మార్చేందుకు ఒక వర్గం చాలా కష్టపడుతోందని కూడా ఆమె విమర్శించింది.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…