Movie News

మహేష్ కాకుంటే.. రాముడు అతనే..


భారతీయ హిందువులకు అత్యంత ఇష్టమైన పురాణ గాథలు మహాభారతం, రామాయణం మీద ఇప్పటికే వివిధ భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. సీరియళ్లు కూడా తీశారు. కానీ గత కొన్నేళ్లలో టెక్నాలజీ విస్తృతి పెరిగి తెరపై అద్భుతాలు ఆవిష్కృతమవుతున్న నేపథ్యంలో ఈ గాథల్ని మరింత గొప్పగా  తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పంతో ఫిలిం మేకర్స్ ఉన్నారు. మహాభారతంపై రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. అందులో రాజమౌళి చేయాలనుకున్న మెగా ప్రాజెక్టు కూడా ఒకటి.

కాకపోతే అది పట్టాలెక్కడానికి టైం పట్టొచ్చు. ఇంకోవైపు రామాయణం మీద ఒక మెగా మూవీ గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. తెలుగువాడైన బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో కలిసి ఈ ప్రాజెక్టు అనౌన్స్  చేసి కొన్నేళ్లవుతోంది. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది.కొన్నేళ్ల నుంచి స్క్రిప్టు తయారీ, ప్రి ప్రొడక్షన్ పనుల్లోనే మునిగి ఉన్న చిత్ర బృందం.. నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేయలేదు. ఐతే ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకుండా పని అవగొట్టేయాలని చూస్తున్నట్లు సమాచారం.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ చిత్రంలో రాముడిగా చూపించాలన్నది మేకర్స్ కోరిక. రాముడి పాత్రకు మహేష్ పర్ఫెక్ట్‌గా సూటవుతాడని భావిస్తున్నారు. మహేష్ వల్ల సౌత్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని.. మిగతా కీలక పాత్రలకు బాలీవుడ్ ఆర్టిస్టులను పెట్టి పాన్ ఇండియా లెవెల్లో దీనికి క్రేజ్ తీసుకురావాలని అనుకున్నారు. కానీ మహేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. వేరే కమిట్మెంట్లకు తోడు.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అయోమయమే అందుక్కారణం.

అందులోనూ రాజమౌళి సినిమా లైన్లో ఉన్న నేపథ్యంలో దానికి ఇబ్బంది రానివ్వకూడదన్నది అతడి ఉద్దేశం. ఈ నేపథ్యంలో ‘రామాయణం’పై మహేష్ విముఖతతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మధు మంతెన, అరవింద్ మహేష్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఐతే మహేష్ నిక్కచ్చిగా ఈ సినిమా చేయనని చెప్పేస్తే.. సెకండ్ ఆప్షన్‌గా రణబీర్ కపూర్‌ను పెట్టుకున్నారు. అతడికి కూడా కమిట్మెంట్లు చాలానే ఉన్నాయి. బ్రహ్మాస్త్ర, అనిమల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతణ్ని ఈ సినిమాకు ఒప్పిస్తే.. రావణుడిగా దక్షిణాది నుంచి పేరున్న నటుడిని పెట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

This post was last modified on January 24, 2022 5:41 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

46 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago