ముంబై ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకి ఒకట్రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు వర్కవుట్ అవ్వకపోవడంతో డీలా పడింది ఈ బ్యూటీ. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కాలం గడిపేసింది.
ఫైనల్ గా ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
ఇందులో ఆమె ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ప్రగ్యా ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు ప్రగ్యా మరో సినిమా సైన్ చేయలేదు. సాధారణంగా ఒక హిట్ పడితేనే హీరోయిన్ల ఫేట్ మారిపోతుంది కానీ ప్రగ్యా విషయంలో అలా జరగడం లేదు.
‘అఖండ’ హిట్ తరువాత ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఇంత పెద్ద హిట్ కొట్టాక తాను కోటి ఎందుకు తీసుకోకూడదని భావిస్తోంది ప్రగ్యా. కానీ అంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు కూడా ఉండాలి కదా.. రీసెంట్ గా ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆమెకు ఆఫర్లు వచ్చినా.. కోటికి తగ్గదేలేదని పట్టుబట్టిందట.
ఆ కారణంగానే ఇప్పటివరకు ప్రగ్యా నుంచి మరో సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. ఆమె డిమాండ్లకు ఒప్పుకొని అవకాశాలు ఇచ్చేవారెవరైనా వస్తే కానీ ఆమె కొత్త సినిమా చేసేలా లేదు. అప్పటివరకు ఖాళీగానే ఉంటుందేమో. కోటి రెమ్యునరేషన్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లనే తీసుకోవచ్చనేది నిర్మాతల ఆలోచన. మరి ప్రగ్యా రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడుతుందేమో చూడాలి!
This post was last modified on January 23, 2022 8:12 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…