ముంబై ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకి ఒకట్రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు వర్కవుట్ అవ్వకపోవడంతో డీలా పడింది ఈ బ్యూటీ. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కాలం గడిపేసింది.
ఫైనల్ గా ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
ఇందులో ఆమె ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ప్రగ్యా ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు ప్రగ్యా మరో సినిమా సైన్ చేయలేదు. సాధారణంగా ఒక హిట్ పడితేనే హీరోయిన్ల ఫేట్ మారిపోతుంది కానీ ప్రగ్యా విషయంలో అలా జరగడం లేదు.
‘అఖండ’ హిట్ తరువాత ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఇంత పెద్ద హిట్ కొట్టాక తాను కోటి ఎందుకు తీసుకోకూడదని భావిస్తోంది ప్రగ్యా. కానీ అంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు కూడా ఉండాలి కదా.. రీసెంట్ గా ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆమెకు ఆఫర్లు వచ్చినా.. కోటికి తగ్గదేలేదని పట్టుబట్టిందట.
ఆ కారణంగానే ఇప్పటివరకు ప్రగ్యా నుంచి మరో సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. ఆమె డిమాండ్లకు ఒప్పుకొని అవకాశాలు ఇచ్చేవారెవరైనా వస్తే కానీ ఆమె కొత్త సినిమా చేసేలా లేదు. అప్పటివరకు ఖాళీగానే ఉంటుందేమో. కోటి రెమ్యునరేషన్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లనే తీసుకోవచ్చనేది నిర్మాతల ఆలోచన. మరి ప్రగ్యా రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడుతుందేమో చూడాలి!
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…