ముంబై ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకి ఒకట్రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు వర్కవుట్ అవ్వకపోవడంతో డీలా పడింది ఈ బ్యూటీ. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కాలం గడిపేసింది.
ఫైనల్ గా ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
ఇందులో ఆమె ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ప్రగ్యా ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు ప్రగ్యా మరో సినిమా సైన్ చేయలేదు. సాధారణంగా ఒక హిట్ పడితేనే హీరోయిన్ల ఫేట్ మారిపోతుంది కానీ ప్రగ్యా విషయంలో అలా జరగడం లేదు.
‘అఖండ’ హిట్ తరువాత ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఇంత పెద్ద హిట్ కొట్టాక తాను కోటి ఎందుకు తీసుకోకూడదని భావిస్తోంది ప్రగ్యా. కానీ అంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు కూడా ఉండాలి కదా.. రీసెంట్ గా ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆమెకు ఆఫర్లు వచ్చినా.. కోటికి తగ్గదేలేదని పట్టుబట్టిందట.
ఆ కారణంగానే ఇప్పటివరకు ప్రగ్యా నుంచి మరో సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. ఆమె డిమాండ్లకు ఒప్పుకొని అవకాశాలు ఇచ్చేవారెవరైనా వస్తే కానీ ఆమె కొత్త సినిమా చేసేలా లేదు. అప్పటివరకు ఖాళీగానే ఉంటుందేమో. కోటి రెమ్యునరేషన్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లనే తీసుకోవచ్చనేది నిర్మాతల ఆలోచన. మరి ప్రగ్యా రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడుతుందేమో చూడాలి!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…