ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘జెంటిల్ మ్యాన్’ ఒకటి. పేరుకిది తమిళ చిత్రం అయినా.. ఇండియా మొత్తం దీని గురించి మాట్లాడుకున్నారు అప్పట్లో. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతోనే అరంగేట్రం చేశాడు. తమిళంలో ఈ చిత్రం బ్లాక్బస్టర్ అయింది. తెలుగులోనూ ఇదే పేరుతో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది. తర్వాత హిందీలో చిరంజీవి హీరోగా దీన్ని రీమేక్ చేస్తే అక్కడ సక్సెస్ అయింది.
కమర్షియాలిటీ, కొత్తదనం, సామాజిక అంశాలు.. ఈ మూడూ ఒకే సినిమాలో పెట్టడం చాలా కష్టం అనుకునే రోజుల్లో శంకర్ ‘జెంటిల్మ్యాన్’ను ఈ మూడు విషయాల్లోనూ ఉన్నతంగా నిలబెట్టి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఒక రకంగా ఈ విషయంలో శంకర్ ట్రెండ్ సెట్ చేశాడనే చెప్పాలి. తర్వాత మురుగదాస్ సహా చాలామంది దర్శకులు ఆయన్ని అనుసరించారు. ఈ ట్రెండ్ సెట్టింగ్ మూవీకి మూడు దశాబ్దాల తర్వాత సీక్వెల్ రాబోతోంది.
కాకపోతే ‘జెంటిల్ మ్యాన్-2’ను శంకర్ డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. హీరోగా కూడా అర్జున్ నటించకపోవచ్చు. ఇంకా దర్శకుడు, హీరో సంగతేమీ తేలలేదు కానీ.. సినిమా మాత్రం అనౌన్స్ చేశాడు నిర్మాత కేటీ కుంజుమోన్. ఈయన 90వ దశకంలో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. శంకర్ను ‘జెంటిల్ మ్యాన్’తో దర్శకుడిగా పరిచయం చేసింది ఆయనే. కొత్త దర్శకుడిని నమ్మి భారీ బడ్జెట్ పెట్టి గొప్ప ఫలితాన్నందుకున్నాడాయన.
ఆ తర్వాత ప్రేమికుడు, ప్రేమదేశం, ప్రేమికుల రోజు, రక్షకుడు లాంటి భారీ చిత్రాలను ఆయన నిర్మించారు. ఐతే ‘రక్షకుడు’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న ఆయన.. కొన్నేళ్లకు సినిమాలే మానేశారు. రెండు దశాబ్దాలుగా చప్పుడు లేని కుంజుమోన్.. ఇప్పుడు ‘జెంటిల్మ్యాన్-2’తో వార్తల్లోకి వచ్చాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణిని ఆయన ఎంచుకోవడం విశేషం. కీరవాణిని కలిసి ఆయన్ని సత్కరిస్తున్న ఫొటోతో ‘జెంటిల్ మ్యాన్-2’ సినిమాను అనౌన్స్ చేశాడు కుంజుమోన్. మరి ఈ సీక్వెల్లో హీరో ఎవరో.. దాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.
This post was last modified on January 23, 2022 2:29 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…