Movie News

త్రివిక్రమ్ అసలు ప్లాన్ ఇదే..!

‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత ఇప్పటివరకు త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు. ఇప్పటికే రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఈ ఏడాది కూడా ఆయన నుంచి సినిమా రాదనే మాటలు వినిపించాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు గతేడాదిలోనే ప్రకటన వచ్చింది.

కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే రీసెంట్ గా సినిమా పాటల పని మొదలైనట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా పూజాహెగ్డేను కూడా ఖాయం చేసుకున్నారు. ఇక షూటింగ్ కి వెళ్లడమే బ్యాలెన్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఏడెనిమిది నెలల సమయం పడుతుంది.

ఎంత వేగంగా షూటింగ్ చేసినా.. పెద్ద హీరో సినిమా అంటే ఏడు నెలల సమయం ఈజీగా పడుతుంది. కాబట్టి సంక్రాంతి 2023కి ఈ సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు త్రివిక్రమ్. ఈ టార్గెట్ తోనే సినిమా పనులు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ ను చాలా కాలం క్రితమే పూర్తి చేశారు త్రివిక్రమ్. మహేష్ వస్తే షూటింగ్ కి వెళ్లడానికి రెడీగా ఉన్నారు.

కానీ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉండి డేట్స్ ఇవ్వలేకపోయారు. ఆ తరువాత మహేష్ కరోనా బారిన పడడం, తన సోదరుడిని కోల్పోవడంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మరింత ఆలస్యమైంది. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ తన సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. మహేష్ కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

This post was last modified on January 22, 2022 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

10 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

22 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago