‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత ఇప్పటివరకు త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు. ఇప్పటికే రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఈ ఏడాది కూడా ఆయన నుంచి సినిమా రాదనే మాటలు వినిపించాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు గతేడాదిలోనే ప్రకటన వచ్చింది.
కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే రీసెంట్ గా సినిమా పాటల పని మొదలైనట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా పూజాహెగ్డేను కూడా ఖాయం చేసుకున్నారు. ఇక షూటింగ్ కి వెళ్లడమే బ్యాలెన్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఏడెనిమిది నెలల సమయం పడుతుంది.
ఎంత వేగంగా షూటింగ్ చేసినా.. పెద్ద హీరో సినిమా అంటే ఏడు నెలల సమయం ఈజీగా పడుతుంది. కాబట్టి సంక్రాంతి 2023కి ఈ సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు త్రివిక్రమ్. ఈ టార్గెట్ తోనే సినిమా పనులు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ ను చాలా కాలం క్రితమే పూర్తి చేశారు త్రివిక్రమ్. మహేష్ వస్తే షూటింగ్ కి వెళ్లడానికి రెడీగా ఉన్నారు.
కానీ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉండి డేట్స్ ఇవ్వలేకపోయారు. ఆ తరువాత మహేష్ కరోనా బారిన పడడం, తన సోదరుడిని కోల్పోవడంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మరింత ఆలస్యమైంది. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ తన సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. మహేష్ కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
This post was last modified on January 22, 2022 6:11 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…