Movie News

త్రివిక్రమ్ అసలు ప్లాన్ ఇదే..!

‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత ఇప్పటివరకు త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు. ఇప్పటికే రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఈ ఏడాది కూడా ఆయన నుంచి సినిమా రాదనే మాటలు వినిపించాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు గతేడాదిలోనే ప్రకటన వచ్చింది.

కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే రీసెంట్ గా సినిమా పాటల పని మొదలైనట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా పూజాహెగ్డేను కూడా ఖాయం చేసుకున్నారు. ఇక షూటింగ్ కి వెళ్లడమే బ్యాలెన్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఏడెనిమిది నెలల సమయం పడుతుంది.

ఎంత వేగంగా షూటింగ్ చేసినా.. పెద్ద హీరో సినిమా అంటే ఏడు నెలల సమయం ఈజీగా పడుతుంది. కాబట్టి సంక్రాంతి 2023కి ఈ సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు త్రివిక్రమ్. ఈ టార్గెట్ తోనే సినిమా పనులు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ ను చాలా కాలం క్రితమే పూర్తి చేశారు త్రివిక్రమ్. మహేష్ వస్తే షూటింగ్ కి వెళ్లడానికి రెడీగా ఉన్నారు.

కానీ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉండి డేట్స్ ఇవ్వలేకపోయారు. ఆ తరువాత మహేష్ కరోనా బారిన పడడం, తన సోదరుడిని కోల్పోవడంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మరింత ఆలస్యమైంది. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ తన సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. మహేష్ కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

This post was last modified on January 22, 2022 6:11 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

10 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

11 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

14 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

14 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

15 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

15 hours ago