Movie News

లాక్ డౌన్ లో హాట్ యాంకర్ కి పెళ్లైందా..?

బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. ‘జబర్దస్త్’, ‘ఢీ’ వంటి షోలకు ఆమె యాంకరింగ్ చేస్తుంటారు. అలానే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తుంటారు. త్వరలోనే ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించనుందని టాక్. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రష్మీ గౌతమ్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

అదేంటంటే.. రష్మీ గౌతమ్ లాక్ డౌన్ లో రహస్యంగా పెళ్లి చేసుకుందట. నిజానికి చాలా కాలంగా సుధీర్ తో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరూ మాత్రం తమ మధ్య స్నేహం తప్ప వేరేమీ లేదని చెబుతూ వచ్చారు. ఇప్పుడు రష్మీ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందట. అయితే ఆ విషయాన్ని ఆమె ఎందుకు సీక్రెట్ గా ఉంచుతుందనే విషయం మాత్రం తెలియడం లేదు.

లాక్ డౌన్ లో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. కానీ రష్మీ మాత్రం తన పెళ్లి విషయాన్ని బయటపెట్టాలనుకోవడం లేదు. అవకాశాలు తగ్గుతాయని ఆమె భావిస్తుందేమోననే సందేహాలు కలుగుతున్నాయి. అలా చూసుకుంటే అనసూయకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా.. ఆమెకి బుల్లితెరపై, వెండితెరపై అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఒకప్పటిలా పెళ్లయితే అవకాశాలు పోతాయనే పరిస్థితి ఇప్పుడు లేదు. మరి ఈ విషయంలో రష్మీ ఏం ఆలోచిస్తుందేమో ఆమెకే తెలియాలి. కానీ ఆమెకి పెళ్లి జరిగిందనే విషయం మాత్రం పక్కా అని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి తన భర్తను ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి!

This post was last modified on January 22, 2022 1:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago