బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. ‘జబర్దస్త్’, ‘ఢీ’ వంటి షోలకు ఆమె యాంకరింగ్ చేస్తుంటారు. అలానే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తుంటారు. త్వరలోనే ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించనుందని టాక్. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రష్మీ గౌతమ్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
అదేంటంటే.. రష్మీ గౌతమ్ లాక్ డౌన్ లో రహస్యంగా పెళ్లి చేసుకుందట. నిజానికి చాలా కాలంగా సుధీర్ తో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరూ మాత్రం తమ మధ్య స్నేహం తప్ప వేరేమీ లేదని చెబుతూ వచ్చారు. ఇప్పుడు రష్మీ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందట. అయితే ఆ విషయాన్ని ఆమె ఎందుకు సీక్రెట్ గా ఉంచుతుందనే విషయం మాత్రం తెలియడం లేదు.
లాక్ డౌన్ లో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. కానీ రష్మీ మాత్రం తన పెళ్లి విషయాన్ని బయటపెట్టాలనుకోవడం లేదు. అవకాశాలు తగ్గుతాయని ఆమె భావిస్తుందేమోననే సందేహాలు కలుగుతున్నాయి. అలా చూసుకుంటే అనసూయకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా.. ఆమెకి బుల్లితెరపై, వెండితెరపై అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ఒకప్పటిలా పెళ్లయితే అవకాశాలు పోతాయనే పరిస్థితి ఇప్పుడు లేదు. మరి ఈ విషయంలో రష్మీ ఏం ఆలోచిస్తుందేమో ఆమెకే తెలియాలి. కానీ ఆమెకి పెళ్లి జరిగిందనే విషయం మాత్రం పక్కా అని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి తన భర్తను ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి!
This post was last modified on January 22, 2022 1:11 pm
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…