బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. ‘జబర్దస్త్’, ‘ఢీ’ వంటి షోలకు ఆమె యాంకరింగ్ చేస్తుంటారు. అలానే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తుంటారు. త్వరలోనే ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించనుందని టాక్. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రష్మీ గౌతమ్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
అదేంటంటే.. రష్మీ గౌతమ్ లాక్ డౌన్ లో రహస్యంగా పెళ్లి చేసుకుందట. నిజానికి చాలా కాలంగా సుధీర్ తో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరూ మాత్రం తమ మధ్య స్నేహం తప్ప వేరేమీ లేదని చెబుతూ వచ్చారు. ఇప్పుడు రష్మీ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందట. అయితే ఆ విషయాన్ని ఆమె ఎందుకు సీక్రెట్ గా ఉంచుతుందనే విషయం మాత్రం తెలియడం లేదు.
లాక్ డౌన్ లో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. కానీ రష్మీ మాత్రం తన పెళ్లి విషయాన్ని బయటపెట్టాలనుకోవడం లేదు. అవకాశాలు తగ్గుతాయని ఆమె భావిస్తుందేమోననే సందేహాలు కలుగుతున్నాయి. అలా చూసుకుంటే అనసూయకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా.. ఆమెకి బుల్లితెరపై, వెండితెరపై అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ఒకప్పటిలా పెళ్లయితే అవకాశాలు పోతాయనే పరిస్థితి ఇప్పుడు లేదు. మరి ఈ విషయంలో రష్మీ ఏం ఆలోచిస్తుందేమో ఆమెకే తెలియాలి. కానీ ఆమెకి పెళ్లి జరిగిందనే విషయం మాత్రం పక్కా అని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి తన భర్తను ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి!
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…