ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. కేవలం గ్రాఫిక్స్ తో వెండితెరపై అద్భుతాలను సృష్టించొచ్చని నిరూపించాయి కొన్ని సినిమాలు. హాలీవుడ్ లో చాలా వరకు సినిమాలన్నీ గ్రాఫిక్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. గ్రాఫిక్స్ కోసం బాగా ఖర్చుపెడుతున్నారు.
ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాలో కూడా సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందట. అదే కాకుండా.. ఇప్పుడు ప్రభాస్, పూజా లేకుండా ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా గ్రాఫిక్స్ సహాయంతో పూర్తి చేసినట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో శృంగారభరితమైన ఓ పాట ఉందట. ఆ సాంగ్ ను తెరకెక్కించడానికి పూజాహెగ్డే కాల్షీట్స్ అందుబాటులో లేవు.
పైగా అలాంటి పాటల్లో నటించాలంటే ప్రభాస్ కి బోలెడంత సిగ్గు. అందుకు చిత్రబృందం వీఎఫ్ఎక్స్ సహాయంతో ఈ సాంగ్ ను పూర్తి చేసేసిందట. ప్రభాస్, పూజా హెగ్డే డూప్ లతో పాటను కానిచ్చేశారని తెలుస్తోంది. క్లోజప్ షాట్స్ లో మాత్రం పూజా, ప్రభాస్ ల ముఖాలే కనిపిస్తాయని సమాచారం. ఇదంతా కూడా వీఎఫ్ఎక్స్ సాయంతో చేసినట్లు తెలుస్తోంది.
‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇలా హీరో, హీరోయిన్లు లేకుండా తీశారంటే సాహసమనే చెప్పాలి. మరి తెరపై ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 21, 2022 9:26 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…