ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. కేవలం గ్రాఫిక్స్ తో వెండితెరపై అద్భుతాలను సృష్టించొచ్చని నిరూపించాయి కొన్ని సినిమాలు. హాలీవుడ్ లో చాలా వరకు సినిమాలన్నీ గ్రాఫిక్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. గ్రాఫిక్స్ కోసం బాగా ఖర్చుపెడుతున్నారు.
ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాలో కూడా సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందట. అదే కాకుండా.. ఇప్పుడు ప్రభాస్, పూజా లేకుండా ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా గ్రాఫిక్స్ సహాయంతో పూర్తి చేసినట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో శృంగారభరితమైన ఓ పాట ఉందట. ఆ సాంగ్ ను తెరకెక్కించడానికి పూజాహెగ్డే కాల్షీట్స్ అందుబాటులో లేవు.
పైగా అలాంటి పాటల్లో నటించాలంటే ప్రభాస్ కి బోలెడంత సిగ్గు. అందుకు చిత్రబృందం వీఎఫ్ఎక్స్ సహాయంతో ఈ సాంగ్ ను పూర్తి చేసేసిందట. ప్రభాస్, పూజా హెగ్డే డూప్ లతో పాటను కానిచ్చేశారని తెలుస్తోంది. క్లోజప్ షాట్స్ లో మాత్రం పూజా, ప్రభాస్ ల ముఖాలే కనిపిస్తాయని సమాచారం. ఇదంతా కూడా వీఎఫ్ఎక్స్ సాయంతో చేసినట్లు తెలుస్తోంది.
‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇలా హీరో, హీరోయిన్లు లేకుండా తీశారంటే సాహసమనే చెప్పాలి. మరి తెరపై ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…