ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. కేవలం గ్రాఫిక్స్ తో వెండితెరపై అద్భుతాలను సృష్టించొచ్చని నిరూపించాయి కొన్ని సినిమాలు. హాలీవుడ్ లో చాలా వరకు సినిమాలన్నీ గ్రాఫిక్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. గ్రాఫిక్స్ కోసం బాగా ఖర్చుపెడుతున్నారు.
ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాలో కూడా సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందట. అదే కాకుండా.. ఇప్పుడు ప్రభాస్, పూజా లేకుండా ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా గ్రాఫిక్స్ సహాయంతో పూర్తి చేసినట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో శృంగారభరితమైన ఓ పాట ఉందట. ఆ సాంగ్ ను తెరకెక్కించడానికి పూజాహెగ్డే కాల్షీట్స్ అందుబాటులో లేవు.
పైగా అలాంటి పాటల్లో నటించాలంటే ప్రభాస్ కి బోలెడంత సిగ్గు. అందుకు చిత్రబృందం వీఎఫ్ఎక్స్ సహాయంతో ఈ సాంగ్ ను పూర్తి చేసేసిందట. ప్రభాస్, పూజా హెగ్డే డూప్ లతో పాటను కానిచ్చేశారని తెలుస్తోంది. క్లోజప్ షాట్స్ లో మాత్రం పూజా, ప్రభాస్ ల ముఖాలే కనిపిస్తాయని సమాచారం. ఇదంతా కూడా వీఎఫ్ఎక్స్ సాయంతో చేసినట్లు తెలుస్తోంది.
‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇలా హీరో, హీరోయిన్లు లేకుండా తీశారంటే సాహసమనే చెప్పాలి. మరి తెరపై ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 21, 2022 9:26 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…