ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. కేవలం గ్రాఫిక్స్ తో వెండితెరపై అద్భుతాలను సృష్టించొచ్చని నిరూపించాయి కొన్ని సినిమాలు. హాలీవుడ్ లో చాలా వరకు సినిమాలన్నీ గ్రాఫిక్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. గ్రాఫిక్స్ కోసం బాగా ఖర్చుపెడుతున్నారు.
ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాలో కూడా సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందట. అదే కాకుండా.. ఇప్పుడు ప్రభాస్, పూజా లేకుండా ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా గ్రాఫిక్స్ సహాయంతో పూర్తి చేసినట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో శృంగారభరితమైన ఓ పాట ఉందట. ఆ సాంగ్ ను తెరకెక్కించడానికి పూజాహెగ్డే కాల్షీట్స్ అందుబాటులో లేవు.
పైగా అలాంటి పాటల్లో నటించాలంటే ప్రభాస్ కి బోలెడంత సిగ్గు. అందుకు చిత్రబృందం వీఎఫ్ఎక్స్ సహాయంతో ఈ సాంగ్ ను పూర్తి చేసేసిందట. ప్రభాస్, పూజా హెగ్డే డూప్ లతో పాటను కానిచ్చేశారని తెలుస్తోంది. క్లోజప్ షాట్స్ లో మాత్రం పూజా, ప్రభాస్ ల ముఖాలే కనిపిస్తాయని సమాచారం. ఇదంతా కూడా వీఎఫ్ఎక్స్ సాయంతో చేసినట్లు తెలుస్తోంది.
‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇలా హీరో, హీరోయిన్లు లేకుండా తీశారంటే సాహసమనే చెప్పాలి. మరి తెరపై ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…