ఈ మధ్యకాలంలో పెద్ద బ్యానర్లు సైతం చిన్న సినిమాలను నిర్మిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ.. భారీ లాభాలను పొందుతున్నారు నిర్మాతలు. గతేడాది వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీదత్ ‘జాతిరత్నాలు’ అనే చిన్న సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరో చిన్న సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించబోతున్నాడట.
స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది. త్వరలోనే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాతో పాటు రోషన్ మరో సినిమా లైన్ లో పెట్టారు. అది కూడా పెద్ద బ్యానర్ లో కావడం విశేషం. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ రోషన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయి.
‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన రోషన్ ఇటీవల ‘పెళ్లి సందడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం లాభాలు వచ్చాయి. దసరా సీజన్ లో సినిమాను విడుదల చేయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది.
పైగా సినిమాలో రోషన్ పెర్ఫార్మన్స్ కు, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. సరైన కథలు పడితే రోషన్ నటుడిగా ఎదగడం ఖాయం. అందుకే వైజయంతీ మూవీస్ ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రోషన్ ను లాక్ చేసింది. ముందు ఈ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తారని తెలుస్తోంది!
This post was last modified on January 21, 2022 5:01 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…