ఈ మధ్యకాలంలో పెద్ద బ్యానర్లు సైతం చిన్న సినిమాలను నిర్మిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ.. భారీ లాభాలను పొందుతున్నారు నిర్మాతలు. గతేడాది వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీదత్ ‘జాతిరత్నాలు’ అనే చిన్న సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరో చిన్న సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించబోతున్నాడట.
స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది. త్వరలోనే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాతో పాటు రోషన్ మరో సినిమా లైన్ లో పెట్టారు. అది కూడా పెద్ద బ్యానర్ లో కావడం విశేషం. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ రోషన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయి.
‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన రోషన్ ఇటీవల ‘పెళ్లి సందడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం లాభాలు వచ్చాయి. దసరా సీజన్ లో సినిమాను విడుదల చేయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది.
పైగా సినిమాలో రోషన్ పెర్ఫార్మన్స్ కు, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. సరైన కథలు పడితే రోషన్ నటుడిగా ఎదగడం ఖాయం. అందుకే వైజయంతీ మూవీస్ ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రోషన్ ను లాక్ చేసింది. ముందు ఈ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తారని తెలుస్తోంది!
This post was last modified on January 21, 2022 5:01 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…