Movie News

శ్రీకాంత్ కొడుకు లైనప్ మాములుగా లేదు!

ఈ మధ్యకాలంలో పెద్ద బ్యానర్లు సైతం చిన్న సినిమాలను నిర్మిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ.. భారీ లాభాలను పొందుతున్నారు నిర్మాతలు. గతేడాది వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీదత్ ‘జాతిరత్నాలు’ అనే చిన్న సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరో చిన్న సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించబోతున్నాడట.

స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది. త్వరలోనే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాతో పాటు రోషన్ మరో సినిమా లైన్ లో పెట్టారు. అది కూడా పెద్ద బ్యానర్ లో కావడం విశేషం. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ రోషన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయి.

‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన రోషన్ ఇటీవల ‘పెళ్లి సందడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం లాభాలు వచ్చాయి. దసరా సీజన్ లో సినిమాను విడుదల చేయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది.

పైగా సినిమాలో రోషన్ పెర్ఫార్మన్స్ కు, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. సరైన కథలు పడితే రోషన్ నటుడిగా ఎదగడం ఖాయం. అందుకే వైజయంతీ మూవీస్ ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రోషన్ ను లాక్ చేసింది. ముందు ఈ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తారని తెలుస్తోంది!

This post was last modified on January 21, 2022 5:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

1 hour ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

2 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

3 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

4 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

5 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 hours ago