ఎక్కడైనా సరే సక్సెస్కు ఉన్న విలువ వేరు. సినీ పరిశ్రమలో దానికున్న విలువ మరింత ఎక్కువ. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. కాబట్టే సినిమా ఫలితాన్ని బట్టి రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతుంటాయి. సినిమా సక్సెస్ అయితే దానికి మూల కారకుడైన దర్శకుడి చుట్టూ క్యూ కట్టేస్తారు. ఫెయిలైతే ప్రతికూల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనేది కూడా దర్శకుడే.
నిన్నుకోరి, మజిలీ సినిమాలతో వరుసగా రెండు విజయాలందుకుని టాలీవుడ్లో మంచి డిమాండే తెచ్చుకున్నాడు యువ దర్శకుడు శివ నిర్వాణ. కానీ అతడి మూడో సినిమా టక్ జగదీష్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేట్రికల్ రిలీజ్ లేకపోవడంతో వల్ల దీని ఫెయిల్యూర్ స్థాయిని అంచనా వేయలేకపోవచ్చు కానీ.. ఈ సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరచలేదన్నది మాత్రం వాస్తవం.
ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా విషయంలో శివ ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. టక్ జగదీష్ సెట్స్ మీద ఉండగానే.. విజయ్ దేవరకొండతో తాను తర్వాతి సినిమా చేయబోతున్నట్లు శివ వెల్లడించడం తెలిసిందే. ఐతే ఈ సినిమా ఎంతకీ ముందుకు కదలడం లేదు. విజయ్ లైగర్ మూవీతో బిజీగా ఉన్న మాట వాస్తవమే అయినా.. ఈ సినిమాకు నిర్మాత ఖరారవ్వలేదు.
ప్రి ప్రొడక్షన్ జరుగుతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు. కథా చర్చల కోసం విజయ్, శివ కలిసినట్లు కూడా ఏమీ వార్తలు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని, సీనియర్ హీరో వెంకటేష్తో శివ సినిమా తన కొత్త చిత్రం చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. దీని గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు కనిపిస్తే దానిపై శివ స్పందించాడు. అది అబద్ధపు వార్త అని కామెంట్ పెట్టాడు. ఐతే విజయ్తో సినిమా క్యాన్సిల్ అయిందన్నది అబద్ధమా.. లేక వెంకీతో సినిమా ఓకే అయిందన్నది అవాస్తవమా అన్నదే జనాలకు అర్థం కాలేదు. దీనిపై శివ కాస్త వివరణ ఇవ్వాల్సిందేమో.
This post was last modified on January 21, 2022 1:00 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…