Movie News

తెలుగు సినిమాలతో జాక్ పాట్

గోల్డ్ మైన్ ఫిలిమ్స్.. ఈ సంస్థది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ స్టోరీ. జియో ఇంటర్నెట్ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఈ రోజు వందలకోట్ల టర్నోవర్‌కు ఎదిగిన సంస్థ ఇది. ఈ సినిమా కంటెంట్ అందించేది హిందీలో. కానీ దీని పెట్టుబడి అంతా సౌత్ సినిమాలే. బాలీవుడ్లో కొన్నేళ్లుగా మాస్ సినిమాలు బాగా తగ్గిపోయి యూపీ, బీహార్ సహా మాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో నైరాశ్యంలో ఉన్న ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సంస్థ యూట్యూబ్‌లో కొన్నేళ్ల కిందట సౌత్ మాస్ మసాలా సినిమాలను హిందీలో డబ్ చేసి వదలడం మొదలుపెట్టింది.

ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు వేటినీ వదిలిపెట్టలేదు. జియో పుణ్యమా అని ఇంటర్నెట్ చౌకగా మారి కావాల్సినంత డేటా అందుబాటులో ఉండటంతో నార్త్ జనాలు.. దక్షిణాది నుంచి వచ్చే ప్రతి డబ్బింగ్ సినిమానూ విరగబడి చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రెబల్ లాంటి డిజాస్టర్ మూవీకి కూడా పదుల కోట్లలో వ్యూస్ వచ్చి పడ్డాయి. రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరో, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి ఫ్లాప్ హీరో సైతం ఉత్తరాదిన మాంచి ఫాలోయింగ్ సంపాదించారు డబ్బింగ్ సినిమాలతో.

ఇక ప్రభాస్, అల్లు అర్జున్‌ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వాళ్ల సినిమా ఏదైనా కొత్తగా ఒకటి వదిలారంటే కోట్లల్లో వ్యూస్ వచ్చి పడిపోతాయి. బన్నీ సినిమాలు సరైనోడు, దువ్వాడ జగన్నాథంలకు వచ్చిన వ్యూస్ చూస్తే పిచ్చెక్కి పోతుంది. మన స్టార్లు నటించిన పెద్ద సినిమాలకు ఏదో ఒక ‘ఖిలాడి’ అని జోడించి సినిమా రిలీజ్ చేయడం.. అక్కడ కోట్లల్లో వ్యూస్, అలాగే భారీగా ఆదాయం అందుకోవడం.. కొన్నేళ్లుగా గోల్డ్ మైన్ ఫిలిమ్స్ ఇలాగే ఎదిగింది. చూస్తుండగానే డబ్బింగ్ సినిమాల మార్కెట్ పెరిగిపోయి మన స్టార్ల సినిమాల డబ్బింగ్ రైట్స్ రూ.10 కోట్లకు పైగా పలికే పరిస్థితి వచ్చింది.

ఇప్పుడీ సంస్థ మన సినిమాలతో థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్లోకి  కూడా అడుగు పెట్టింది. ఇంతకుముందు ‘నా పేరు సూర్య’ను థియేటర్లలో రిలీజ్ చేసి మంచి ఫలితాన్నందుకున్న గోల్డ్ మైన్ ఫిలిమ్స్.. తాజాగా ‘పుష్ప’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసి జాక్ పాట్ కొట్టింది. ఈ చిత్రంతో భారీ లాభాలందుకుని తన రేంజ్ పెంచుకుంది. ఒకప్పుడు సౌత్ నుంచి సినిమాలను డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటే ఆ సంస్థను లైట్ తీసుకున్న బాలీవుడ్ జనాలు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుగుదల చూసి షాకవుతున్నారు. పేరున్న నిర్మాణ సంస్థల్నిమించి అదిప్పుడు ఆదాయం సాధిస్తుండటం చూసి వారికి దిమ్మదిరిగిపోతోంది.

This post was last modified on January 20, 2022 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మట్కాని చూపించే పద్దతి ఇది

మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…

14 minutes ago

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…

42 minutes ago

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

1 hour ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

9 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

10 hours ago

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…

13 hours ago