Movie News

తెలుగు సినిమాలతో జాక్ పాట్

గోల్డ్ మైన్ ఫిలిమ్స్.. ఈ సంస్థది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ స్టోరీ. జియో ఇంటర్నెట్ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఈ రోజు వందలకోట్ల టర్నోవర్‌కు ఎదిగిన సంస్థ ఇది. ఈ సినిమా కంటెంట్ అందించేది హిందీలో. కానీ దీని పెట్టుబడి అంతా సౌత్ సినిమాలే. బాలీవుడ్లో కొన్నేళ్లుగా మాస్ సినిమాలు బాగా తగ్గిపోయి యూపీ, బీహార్ సహా మాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో నైరాశ్యంలో ఉన్న ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సంస్థ యూట్యూబ్‌లో కొన్నేళ్ల కిందట సౌత్ మాస్ మసాలా సినిమాలను హిందీలో డబ్ చేసి వదలడం మొదలుపెట్టింది.

ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు వేటినీ వదిలిపెట్టలేదు. జియో పుణ్యమా అని ఇంటర్నెట్ చౌకగా మారి కావాల్సినంత డేటా అందుబాటులో ఉండటంతో నార్త్ జనాలు.. దక్షిణాది నుంచి వచ్చే ప్రతి డబ్బింగ్ సినిమానూ విరగబడి చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రెబల్ లాంటి డిజాస్టర్ మూవీకి కూడా పదుల కోట్లలో వ్యూస్ వచ్చి పడ్డాయి. రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరో, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి ఫ్లాప్ హీరో సైతం ఉత్తరాదిన మాంచి ఫాలోయింగ్ సంపాదించారు డబ్బింగ్ సినిమాలతో.

ఇక ప్రభాస్, అల్లు అర్జున్‌ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వాళ్ల సినిమా ఏదైనా కొత్తగా ఒకటి వదిలారంటే కోట్లల్లో వ్యూస్ వచ్చి పడిపోతాయి. బన్నీ సినిమాలు సరైనోడు, దువ్వాడ జగన్నాథంలకు వచ్చిన వ్యూస్ చూస్తే పిచ్చెక్కి పోతుంది. మన స్టార్లు నటించిన పెద్ద సినిమాలకు ఏదో ఒక ‘ఖిలాడి’ అని జోడించి సినిమా రిలీజ్ చేయడం.. అక్కడ కోట్లల్లో వ్యూస్, అలాగే భారీగా ఆదాయం అందుకోవడం.. కొన్నేళ్లుగా గోల్డ్ మైన్ ఫిలిమ్స్ ఇలాగే ఎదిగింది. చూస్తుండగానే డబ్బింగ్ సినిమాల మార్కెట్ పెరిగిపోయి మన స్టార్ల సినిమాల డబ్బింగ్ రైట్స్ రూ.10 కోట్లకు పైగా పలికే పరిస్థితి వచ్చింది.

ఇప్పుడీ సంస్థ మన సినిమాలతో థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్లోకి  కూడా అడుగు పెట్టింది. ఇంతకుముందు ‘నా పేరు సూర్య’ను థియేటర్లలో రిలీజ్ చేసి మంచి ఫలితాన్నందుకున్న గోల్డ్ మైన్ ఫిలిమ్స్.. తాజాగా ‘పుష్ప’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసి జాక్ పాట్ కొట్టింది. ఈ చిత్రంతో భారీ లాభాలందుకుని తన రేంజ్ పెంచుకుంది. ఒకప్పుడు సౌత్ నుంచి సినిమాలను డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటే ఆ సంస్థను లైట్ తీసుకున్న బాలీవుడ్ జనాలు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుగుదల చూసి షాకవుతున్నారు. పేరున్న నిర్మాణ సంస్థల్నిమించి అదిప్పుడు ఆదాయం సాధిస్తుండటం చూసి వారికి దిమ్మదిరిగిపోతోంది.

This post was last modified on January 20, 2022 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

2 hours ago

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

6 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

8 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

9 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

10 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

11 hours ago