టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో చాలామంది ఏదో ఒక సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి.. తమ చిజిల్డ్ బాడీతో షో చేసిన వాళ్లే. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టింది అల్లు అర్జున్ అనే చెప్పాలి. అతను ‘దేశముదురు’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి అప్పట్లో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. అప్పటిదాకా స్టార్ హీరోల్లో ఎవ్వరూ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా చాలామంది సిక్స్ ప్యాక్స్తో అలరించారు. తర్వాత లీగ్ హీరోల్లో అదిరిపోయే రీతిలో బాడీ పెంచి ఆశ్చర్యపరిచిన వాళ్లలో రామ్ ఒకడు.
మామూలుగా చూడ్డానికి చాక్లెట్ బాయ్లా కనిపించే అతను.. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం పూర్తిగా అవతారం మార్చేశాడు. చాలా రఫ్గా ఉండే లుక్కు తోడు.. సిక్స్ ప్యాక్ బాడీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా చివర్లో బేర్ బాడీతో అతను ఫైట్ చేయడం మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇప్పుడు రామ్ మరోసారి ఈ ఫీట్ రిపీట్ చేయబోతున్నాడు. కాకపోతే ‘ఇస్మార్ట్ శంకర్’తో పోలిస్తే ఈసారి అతడి లుక్ పూర్తి భిన్నంగా కనిపించనుంది. తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి రామ్ తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు సంక్రాంతి సందర్భంగా. అందులో రామ్ పోలీస్ పాత్రలో కనిపించాడు. తన కెరీర్లో రామ్ చేస్తున్న తొలి పోలీస్ పాత్ర ఇదే. ఈ పాత్ర కోసం రామ్ శారీరకంగా మరింత కష్టపడ్డాడట.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మధ్యలో ‘రెడ్’ కోసం నార్మల్ బాడీలోకి వచ్చిన రామ్.. ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు కష్టపడి మళ్లీ బాడీ పెంచాడట. ‘ఇస్మార్ట్ శంకర్’ను మించి ఇందులో కండలు తిరిగిన శరీరంతో, సిక్స్ ప్యాక్తో కనిపించనున్నాడట. ఓ సన్నివేశంలో బేర్ బాడీతో అతను సందడి చేయబోతున్నట్లు సమాచారం. ‘సీటీమార్’ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on January 19, 2022 5:52 pm
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…