ప్రతి వ్యక్తీ వ్యక్తిగత జీవితంలో ఉన్న స్నేహితులతో పాటు తాను పని చేసే రంగంలో సన్నిహితులను సంపాదించుకోవడం సహజం. టైం టు టైం జాబ్స్ చేస్తున్నపుడు కూడా ప్రొఫెషనల్గా ఫ్రెండ్స్ తయారవుతారు. ఇక రోజు వారీ పనిలో ఒక టైమింగ్ అంటూ లేకుండా.. మొత్తంగా నిర్దిష్ట కాలం అని లేకుండా పని చేసే ఇండస్ట్రీల్లో స్నేహితులు లేకుండా ఉండరు. అందులోనూ సినిమాలను జీవితంగా మార్చుకుని పని చేసే వ్యక్తులకు ఆ ఇండస్ట్రీలో స్నేహితులు లేరంటే నమ్మడం కష్టంగా ఉంటుంది.
ఇక్కడ అన్ని వ్యవహారాలూ సక్సెస్ చుట్టూ, డబ్బుల చుట్టూనే తిరుగుతాయన్న మాటలు వినిపిస్తున్నా సరే.. ఇందులోనూ ఆప్త మిత్రులు ఉంటారు. కానీ మూడు దశాబ్దాలకు పైగా తాను పని చేస్తున్న పరిశ్రమలో తనకు ఒక్కరంటే ఒక్క స్నేహితుడు కూడా లేదని తేల్చేశాడు సీనియర్ నటుడు జగపతిబాబు. ఈ విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగానే మాట్లాడారు ఓ ఇంటర్వ్యూలో. తమిళ నటుడు అర్జున్ తనకున్న జెన్యూన్ ఫ్రెండ్స్లో ఒకడని జగపతిబాబు చెప్పాడు.
తమది ఎన్నో ఏళ్ల అనుబంధం అని.. ఆ స్నేహంతోనే ఒకరి సినిమాల్లో ఒకరం నటించామని, వ్యక్తిగతంగా కూడా తమ మధ్య మంచి అనుబంధం ఉందని జగపతి చెప్పాడు. ఐతే అర్జున్, తాను గొడవపడే తీరు చూస్తే మాత్రం చూసే వాళ్లకు తాము స్నేహితుల్లా కాకుండా శత్రువుల్లా కనిపిస్తామని ఆయన అన్నాడు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో మీకు స్నేహితులెవరూ లేరా అని అడిగితే.. నిజాయితీగా చెప్పాలంటే లేరు అనేశారు జగపతి.
ఎవరినైనా స్నేహితుడు అని చెబుదామనుకుంటే వాళ్లు ఎలాంటి వాళ్లు, తనతో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది గుర్తుకొస్తుందని.. అలా గుర్తొచ్చినపుడు వారిని తాను స్నేహితులు అనలేనని జగపతి తేల్చేశాడు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనుకునేవాళ్లందరూ రాత్ గయా.. బాత్ గయా టైపే అని ఆయన వ్యాఖ్యానించాడు. జగపతిబాబు ముక్కుసూటి మనిషి అనే విషయం అందరికీ తెలుసని.. మరీ తాను మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న పరిశ్రమలో ఒక్కరంటే ఒక్క స్నేహితుడు కూడా లేడని చెప్పేంత ముక్కుసూటి తనం ఆయనది కావడమే ఆశ్చర్యం.
This post was last modified on January 19, 2022 12:57 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…